LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Band Melam movie Update: మెగాస్టార్ చేతుల మీదుగా ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ లాంచ్.. మార్చి 26న థియేటర్లలో సందడి!

Band Melam Trailer: మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ‘బ్యాండ్ మేళం’ మూవీ ట్రైలర్ విశేషాలు..హర్ష్ రోషన్, శ్రీదేవి అపల్ల జంటగా సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పల్లెటూరి ప్రేమకథ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

AndhraPravasi News Desk 2 min read
Band Melam movie Update: మెగాస్టార్ చేతుల మీదుగా ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్ లాంచ్.. మార్చి 26న థియేటర్లలో సందడి!

Band Melam Trailer:  గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. గతంలో ‘కోర్టు’ అనే సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ జంట హర్ష్ రోషన్  శ్రీదేవి అపల్ల ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ అనే చిత్రంతో మరోసారి మన ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి, చిత్ర యూనిట్‌ను అభినందించారు. మెగాస్టార్ మద్దతు లభించడంతో ఈ చిన్న సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

ట్రైలర్ చూస్తుంటే, ఇది పక్కా పల్లెటూరి వాతావరణంలో సాగే వినోదాత్మక ప్రేమకథ అని అర్థమవుతోంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బావమరదళ్లు గిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి)ల మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా ఉంది. వారి మధ్య ఉండే అల్లరి, ప్రేమ, ఆ తర్వాత వచ్చే చిన్నపాటి అపార్థాలు, వాటి వల్ల కలిగే దూరం వంటి అంశాలను దర్శకుడు సతీష్ జవ్వాజి చాలా హృద్యంగా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరి అందాలను, అక్కడి మనుషుల భావోద్వేగాలను కెమెరాలో చాలా చక్కగా బంధించారు.

ఈ సినిమాకు మరో ప్రధాన బలం సంగీతం. ‘బేబి’ సినిమాతో మ్యూజికల్ సెన్సేషన్ సృష్టించిన విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.  ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పించడం, సీనియర్ నటుడు సాయి కుమార్ ఒక కీలక పాత్రలో నటించడం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. గ్రామీణ కథలకు కోన వెంకట్ మార్క్ వినోదం తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నిజానికి ఈ సినిమాను మార్చి 13నే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అదే సమయంలో థియేటర్లలోకి వస్తుండటంతో, థియేటర్ల సర్దుబాటు  పెద్ద సినిమాతో పోటీ పడటం ఇబ్బంది అవుతుందని భావించి వాయిదా వేశారు. ప్రస్తుత సమయాన్ని సినిమా ప్రమోషన్ల కోసం చిత్ర బృందం సమర్థవంతంగా వాడుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ‘బ్యాండ్ మేళం’ గురించి మంచి చర్చ నడుస్తోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సమ్మర్ సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో, ఇలాంటి ఒక మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. హర్ష్ రోషన్, శ్రీదేవి జంట మరోసారి హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…