SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! AP CETs 2026: ఏపీ సెట్స్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల... హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! Mega Parent-Teacher Meet: జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్! TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! TTD: బధిర విద్యార్థులకు టీటీడీ బంపర్ ఆఫర్! 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, హాస్టల్ కూడా.. దరఖాస్తు వివరాలు!! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు... SSC Results 2026: పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! AP CETs 2026: ఏపీ సెట్స్ 2026 అడ్మిట్ కార్డ్స్ విడుదల... హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి! Mega Parent-Teacher Meet: జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్! TG SSC Results: విద్యార్థులకు టెన్షన్.. తల్లిదండ్రులకు ఉత్కంఠ! వాట్సాప్‌లో 'Hi' అని పంపండి.. రేపే టెన్త్ ఫలితాలు.! TTD: బధిర విద్యార్థులకు టీటీడీ బంపర్ ఆఫర్! 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, హాస్టల్ కూడా.. దరఖాస్తు వివరాలు!! School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు! NEET UG: నీట్ యూజీ 2026 అభ్యర్థులకు అలర్ట్! ఎన్టీఏ డ్రెస్ కోడ్ నిబంధనలు ఇవే...! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! AP POLYCET: ఏపీ పాలిసెట్ విద్యార్థులకు అలర్ట్...! పరీక్షా విధానం మరియు ఫలితాల పూర్తి వివరాలు! JEE Main: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్! నిట్‌లలో ఈ ఏడాది నుంచే కొత్త కోర్సులు...

Relians: రిలయన్స్ స్కాలర్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా..! 1,883 మందికి ఎంపిక!

 దేశవ్యాప్తంగా నిర్వహించిన అత్యంత పోటీతో కూడిన జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియలో మొత్తం 5,100 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. వీరిలో 5,000 మంది

Published : 2026-01-07 19:41:00
ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు!

దేశవ్యాప్తంగా నిర్వహించిన అత్యంత పోటీతో కూడిన జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియలో మొత్తం 5,100 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. వీరిలో 5,000 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులుగా, 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. ఈ ఎంపికలో తెలుగు రాష్ట్రాలు మరోసారి తమ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,345 మంది, తెలంగాణ నుంచి 538 మంది విద్యార్థులు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ తెలుగు విద్యార్థులు సాధించిన ఈ విజయం, వారి అకడమిక్ సామర్థ్యానికి, కష్టపడి చదివే తత్వానికి స్పష్టమైన నిదర్శనంగా మారింది.

పోలవరం.. ఏపీ జీవనాడి! అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్! ఫిబ్రవరి 15 నాటికి..

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ఉన్నత విద్యను అందించడమే ఈ స్కాలర్‌షిప్ (Scholarship) ప్రధాన లక్ష్యం. ప్రతిభ–ఆర్థిక స్థితి ఆధారంగా (Merit-cum-Means) విధానంలో జరిగిన ఈ ఎంపికలో 83 శాతం మంది విద్యార్థులు వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాల నుంచి రావడం గమనార్హం. ముఖ్యంగా బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు తగిన ప్రాధాన్యం కల్పించారు. ఎంపికైన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 2 లక్షల వరకు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రూ. 6 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇది పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య కలగా కాకుండా వాస్తవంగా మారేందుకు తోడ్పడనుంది.

మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం! అది జరగదు.. జరగనివ్వం!

ఈ స్కాలర్‌షిప్ ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా, విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతోంది. మెంటరింగ్, లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ శిక్షణ, గ్లోబల్ అల్యూమిని నెట్‌వర్క్‌తో అనుసంధానం వంటి అవకాశాలు కూడా అందించనున్నారు. ఈ సమగ్ర సహకారం ద్వారా విద్యార్థులు కేవలం చదువులోనే కాదు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యతలోనూ ముందంజ వేయగలుగుతారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే నూతన తరం నాయకులను తయారు చేయడమే ఈ కార్యక్రమం దీర్ఘకాలిక లక్ష్యంగా కనిపిస్తోంది.

Praja Vedika: రేపు (8/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తెలంగాణ నుంచి ఎంపికైన విద్యార్థుల్లో భద్రాచలానికి చెందిన రైతు బిడ్డ యర్ర షాలిని ఒకరు. ప్రస్తుతం పంజాబ్‌లోని ఐఐటీ రోపర్‌లో BSc, BEd చదువుతున్న ఆమె తన అనుభవాన్ని పంచుకుంటూ, “మాలాంటి వ్యవసాయ కుటుంబాల పిల్లలకు ఆర్థిక సమస్యలే ఉన్నత విద్యకు పెద్ద అడ్డంకి. ఈ స్కాలర్‌షిప్ వల్ల నా చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతున్నాను. నా లక్ష్యాలను సాధించడానికి ఇది గొప్ప ప్రోత్సాహం” అని అన్నారు. ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ ( Reliance Foundation) వివిధ సామాజిక వర్గాలకు చెందిన 33,471 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించింది. ధీరుభాయ్ అంబానీ దార్శనికతతో నీతా అంబానీ 2022లో ప్రకటించిన ఈ కార్యక్రమం, వచ్చే 10 ఏళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

Teacher Jobs: వచ్చే నెలలోనే మరో DSC నోటిఫికేషన్..! మొత్తం ఎన్ని పోస్టులు అంటే..!
Road Development: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! రూ.39 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!
UAEలో స్కూల్ భద్రతకు కొత్త రూల్స్.. విద్యార్థులకు ఇక నుండి అవి తప్పనిసరి!
Two Guinness: ఏపీలో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు… భారత్ నిర్మిస్తోంది… ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తోంది... సీఎం చంద్రబాబు!
DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు!
USA Green Card Holders: అమెరికాలో గ్రీన్‌కార్డ్ హోల్డర్ల కు అతి భారీ షాక్… ఇక మీ గ్రీన్‌కార్డ్ గోవిందా! గోవింద!!

Spotlight

Read More →