Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! KVS Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్స్ 2026-27... ఒకటవ తరగతి ప్రవేశాల షెడ్యూల్ ఇదే! Student Tragedy: గుంటూరులో విషాదం... చెరువులో శవమై కనిపించిన పదో తరగతి విద్యార్థి! NEET MDS: నీట్ ఎండీఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..! దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!!

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కీలకమైన మార్పులతో ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు 2026 పబ్లిక్‌ పరీక్షలకు కొత్త విధానాన్ని ప్రకటించింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబ

Published : 2025-12-14 11:01:00
Pension Alert: ఏపీ పింఛన్‌దారులకు బిగ్ రిలీఫ్…! పింఛన్ ముందే అందజేత.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కీలకమైన మార్పులతో ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు 2026 పబ్లిక్‌ పరీక్షలకు కొత్త విధానాన్ని ప్రకటించింది. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త సిలబస్‌ను ఇప్పటికే అమల్లోకి తీసుకువచ్చిన బోర్డు, అదే దిశలో పరీక్షల సరళిని కూడా పూర్తిగా మార్చింది. జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీని ద్వారా విద్యార్థుల్లో భావనాత్మక అవగాహన పెంచడం, ఒత్తిడి తగ్గించడం, చదువును మరింత ప్రయోజనకరంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

CIC Chief: కేంద్ర సమాచార కమిషన్‌లో కీలక మార్పులు…! చీఫ్‌గా ఆయన నియామకం..!

వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అయితే ఈ కొత్త విధానం ప్రధానంగా ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు మాత్రమే వర్తించనుంది. సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ఈ ఏడాది పాత సిలబస్‌, పాత పరీక్షా విధానమే కొనసాగుతుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఉంటారు.

US Immigration: ఇమిగ్రేషన్ మోసాలను అరికట్టేందుకు అమెరికా వలస నిబంధనలు కఠినం… పాత ఫోటోలపై!!

కొత్త విధానం ప్రకారం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ సబ్జెక్టులన్నింటికీ ఒక్కో పేపర్‌కు 100 మార్కులుగా పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రశ్నాపత్రాల్లో చిన్న ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఒక్క మార్కు, అర మార్కు ప్రశ్నల విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు విస్తృతంగా రాయాల్సిన అవసరం లేకుండా భావనలను స్పష్టంగా అర్థం చేసుకున్నారా లేదా అన్నది పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయని అధికారులు తెలిపారు.

GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!!

పరీక్షల్లో జవాబులు రాయడానికి ఇచ్చే బుక్‌లెట్‌లను కూడా పెంచారు. సిలబస్‌లో మార్పులు చేసిన సబ్జెక్టులకు 32 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్‌ను అందించనున్నారు. సిలబస్‌ మారని సబ్జెక్టులకు మాత్రం ఇప్పటివరకు ఉన్నట్లే 24 పేజీల బుక్‌లెట్‌ను కొనసాగిస్తారు. ఒక్కో పరీక్షకు కనీసం రెండు రోజుల గ్యాప్‌ ఉండేలా టైమ్‌టేబుల్‌ను రూపొందించడం వల్ల విద్యార్థులకు సరైన రివిజన్‌కు అవకాశం లభించనుంది.

Tirumala: శ్రీవారి దర్శనానికి భక్తుల వెల్లువ…! గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షణ..!

ఇంటర్మీడియట్‌లో సబ్జెక్టుల సంఖ్య విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు సైన్స్‌ గ్రూపుల్లో రెండు భాషలు, నాలుగు ప్రధాన సబ్జెక్టులతో కలిపి ఆరు సబ్జెక్టులు ఉండేవి. ఆర్ట్స్‌ గ్రూపుల్లో ఐదు సబ్జెక్టులు ఉండేవి. అయితే కొత్త విధానంలో అన్ని గ్రూపులకు ఐదు సబ్జెక్టుల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో ఒక భాష, నాలుగు ప్రధాన సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లిష్‌ మాత్రం తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతుంది.

Gold Investment News: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

రెండో భాషను ఆరో సబ్జెక్టుగా ఎలక్టివ్‌గా మార్చారు. విద్యార్థులు భాష లేదా అందుబాటులో ఉన్న 23 ప్రధాన సబ్జెక్టులలో ఏదైనా ఒకదాన్ని ఆరో సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. మొదటి ఐదు సబ్జెక్టుల్లో ఏదైనా ఒకటి ఫెయిల్‌ అయి, ఆరో సబ్జెక్టులో పాస్‌ అయితే, ఆ ఆరో సబ్జెక్టును మెయిన్‌ సబ్జెక్టుగా పరిగణిస్తారు. అయితే ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా పాస్‌ కావాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది.

AmazonTech News: తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడి.. హైదరాబాద్‌లో AWS డేటా సెంటర్ విస్తరణ!!

మ్యాథ్స్‌లో ఇప్పటివరకు ఉన్న ఏ, బి పేపర్ల విధానాన్ని రద్దు చేసి ఒక్క పేపర్‌ మాత్రమే నిర్వహించనున్నారు. అలాగే బైపీసీ గ్రూపులో బోటనీ, జువాలజీని కలిపి ‘బయాలజీ’గా ఒక్క పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తారు. అయితే జవాబులు రాయడానికి రెండు వేర్వేరు బుక్‌లెట్‌లు ఇస్తారు. ఆర్ట్స్‌ గ్రూపుల్లో సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ వంటి గ్రూపులకు 26 రకాల కాంబినేషన్లు అందుబాటులో ఉంచారు.

AP Govt: ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు..! నియామకాలు ఫైనల్!

మార్కుల కేటాయింపులోనూ మార్పులు చేశారు. సైన్స్‌ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి రాత పరీక్ష 85 మార్కులకు ఉంటుంది. మిగిలిన మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయిస్తారు. ప్రతి పేపర్‌లో ఉత్తీర్ణతకు కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం వల్ల విద్యార్థుల్లో పరీక్షలపై భయం తగ్గి, చదువుపై ఆసక్తి పెరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!!
Women Empowerment: రూ.30 లక్షల జీతం ఉన్నా.. నా కోసం నేను జీవించడం మరిచిపోయా, అదే నిజమైన సంతృప్తి!
New Pensions: అమరావతిలో భూమి లేని పేదలకు శుభవార్త.. రూ.5 వేల పింఛన్ పునరుద్ధరణ! వెంటనే దరఖాస్తు చేసుకోండి!
దర్శకుడు నుండి ప్రొడ్యూసర్‌గా మారిన మరో టాలీవుడ్ ప్రముఖుడు.. పరిశ్రమకు కొత్త శక్తి...
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!
Lokeshs post: భర్తగా గర్వంగా ఉంది.. బ్రాహ్మణిపై లోకేశ్ ఎమోషనల్ పోస్ట్!

Spotlight

Read More →