LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

Inter Summer Holidays: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచే కాలేజీలు షురూ.. సెలవులు ఎప్పుడంటే?

AP Inter Academic Calendar: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి సెకండియర్ క్లాసులు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 24 నుండి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు.

AndhraPravasi News Desk 2 min read
Inter Summer Holidays: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచే కాలేజీలు షురూ.. సెలవులు ఎప్పుడంటే?

AP Inter Academic Calendar: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది.  వేసవి సెలవుల తర్వాత జూన్‌లో కాలేజీలు ప్రారంభం అవుతుంటాయి, కానీ ఈసారి మాత్రం ఇంటర్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. ఫస్టియర్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ 1వ తేదీ నుంచే సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. అంటే విద్యార్థులు వేసవి తాపాన్ని తట్టుకుంటూనే కొన్ని రోజుల పాటు క్లాసులకు హాజరు కావాల్సి ఉంటుంది.

విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. సిలబస్‌ను ముందుగానే గాడిలో పెట్టే ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతాయి. దాదాపు 37 రోజుల పాటు విద్యార్థులకు వేసవి విరామం లభించనుంది. తిరిగి జూన్ 1వ తేదీన కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని బోర్డు స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 పని దినాలు ఉంటాయని అధికారులు లెక్కగట్టారు.

మరోవైపు ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకూడదని ఆదేశించింది. ముఖ్యంగా మా దగ్గర చదివితే స్టేట్ ర్యాంకులు వస్తాయి.. గ్యారెంటీగా పాస్ చేయిస్తాం అంటూ ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. గోడలపై రాతలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విచ్చలవిడిగా అడ్మిషన్ల ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాలేజీల మధ్య అనారోగ్యకరమైన పోటీని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.

ఇక పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే.. అక్టోబరు 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు, నవంబరు 25 నుంచి 30 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. దసరా పండుగ కోసం అక్టోబరు 10 నుంచి 20 వరకు, అలాగే సంక్రాంతి కోసం జనవరి 9 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించారు. జనవరి మూడో వారంలో ప్రీ-ఫైనల్ పరీక్షలు ముగించి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి నెలలో ఇంటర్ పబ్లిక్ థియరీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 18వ తేదీని ఈ విద్యా సంవత్సరపు చివరి పని దినంగా నిర్ణయించారు.

ఏపీలో ఇంటర్ విద్యారంగంలో మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2025-26 నుంచే ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ప్రవేశపెడుతూ సీబీఎస్‌ఈ  విధానాన్ని తీసుకొస్తున్న తరుణంలో, ఈ అకడమిక్ క్యాలెండర్ అమలు చాలా కీలకం కానుంది. విద్యార్థులు ఈ కొత్త మార్పులకు అనుగుణంగా తమ చదువులను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, కాలేజీల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…