LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి!

RBI: దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నేడు ప్రకటించనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10 గంటలకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు.

AndhraPravasi News Desk 2 min read
RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి!

ఆర్బీఐ నిర్ణయాల కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి..

వడ్డీ రేట్లు యథాతథంగా ఉండే అవకాశం..

ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నేడు ప్రకటించనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10 గంటలకు ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్నారు.

ఆరు మంది సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ మూడు రోజుల పాటు సమావేశమై దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, వృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మార్కెట్లు, వ్యాపార వర్గాలు, బ్యాంకింగ్ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

గత ఏప్రిల్‌లో ఆర్బీఐ కీలక రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. ఈసారి కూడా వడ్డీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కీలక వడ్డీ రేటు 5.25 శాతం వద్ద కొనసాగుతోంది.

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆర్బీఐ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితులు ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి రెండింటిపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచవచ్చని విశ్లేషిస్తున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సి.ఎస్. సెట్టి కూడా ఇటీవల ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వడ్డీ రేట్లలో మార్పులు చేయకుండా కొనసాగిస్తే ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు కొందరు ఆర్థిక నిపుణులు ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను పెంచే అవకాశం ఉందని, అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4 శాతంగా నిర్ణయించింది. దీనికి గరిష్ఠ పరిమితి 6 శాతం, కనిష్ఠ పరిమితి 2 శాతంగా నిర్దేశించింది. ఏప్రిల్ నెలలో సీపీఐ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.48 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాల ధరలు, కొన్ని నిత్యావసర వంటగది వస్తువుల ధరలు పెరగడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

నేటి ఆర్బీఐ ప్రకటన దేశ ఆర్థిక వ్యవస్థ దిశను సూచించే కీలక నిర్ణయంగా భావిస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు, సాధారణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…