LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

Exports: 2030-31 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: పీయూష్ గోయల్!

Exports: కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల రంగంలో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030-31 నాటికి మొత్తం ఎగుమతులను 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Exports: 2030-31 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం: పీయూష్ గోయల్!

భారీ ఎగుమతి లక్ష్యానికి కేంద్రం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం..

ఎగుమతుల మిషన్‌కు ఐటీ ఆధారిత పర్యవేక్షణ..

కేంద్ర ప్రభుత్వం ఎగుమతుల రంగంలో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030-31 నాటికి మొత్తం ఎగుమతులను 2 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందులో 1 ట్రిలియన్ డాలర్లు సరుకుల (మెర్చండైజ్) ఎగుమతులు, మరో 1 ట్రిలియన్ డాలర్లు సేవల ఎగుమతుల రూపంలో సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

న్యూఢిల్లీ లో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ లక్ష్య సాధనకు రూపొందించిన కార్యాచరణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మూడు ప్రధాన స్థంభాలపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి రంగానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు, ఖచ్చితమైన గడువులు నిర్ధేశించడం, ప్రతి చర్యను సంబంధిత జాయింట్ సెక్రటరీకి బాధ్యతగా అప్పగించడం, అలాగే వాటిని సరఫరా (Supply-side), డిమాండ్ (Demand-side) అంశాలుగా విభజించడం వంటి అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి.

ఇక ప్రతి కార్యక్రమాన్ని కీలక పనితీరు సూచికలతో (KPIs) అనుసంధానం చేసి, తక్కువ, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేయాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఐటీ ఆధారిత మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందులో ప్రగతిని నిరంతరం ట్రాక్ చేయడం, అవసరమైతే ఉన్నతస్థాయిలో సమీక్షకు స్వయంచాలక విధానం ఉండాలని చెప్పారు.

అదేవిధంగా MSME రంగాన్ని ప్రోత్సహించే ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (Export Promotion Mission - EPM) అమలు పరిస్థితిని కూడా మంత్రి పరిశీలించారు. ముఖ్యంగా వ్యవసాయ ఎగుమతులు మరియు సూక్ష్మ, చిన్న పరిశ్రమల అభివృద్ధి ఈ మిషన్‌లో కీలకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ యాక్సెస్ సపోర్ట్‌ను కేవలం ఎగుమతి ప్రోత్సాహక మండళ్లకే పరిమితం చేయకుండా, ప్రాతినిధ్య స్థాయిలో పనిచేసే ఇతర సంస్థలకు కూడా విస్తరించాలని మంత్రి సూచించారు. ఈ చర్యల ద్వారా భారత ఎగుమతుల రంగం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…