LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Business

Visakhapatnam: విశాఖలో ఏఐ విప్లవానికి నాంది.. భారత్ డిజిటల్ గేట్‌వేగా.. -జీత్ అదానీ!

Visakhapatnam: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో భారత్ ఏఐ రంగంలో ఒక పెద్ద ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Visakhapatnam: విశాఖలో ఏఐ విప్లవానికి నాంది.. భారత్ డిజిటల్ గేట్‌వేగా.. -జీత్ అదానీ!

కంప్యూట్ రంగంలో ఈ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో విశాఖ అత్యంత ముఖ్యమైన పాత్ర..

ముంబై, చెన్నైలోనే పరిమితమైన డేటా సెంటర్ లు ఇక విశాఖలోకి అడుగు పెట్టాయి..

విశాఖపట్నం: విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో భారత్ ఏఐ రంగంలో ఒక పెద్ద ముందడుగు వేసిందని ఆయన పేర్కొన్నారు.

1 గిగావాట్ సామర్థ్యంతో నిర్మించబడుతున్న హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ దేశానికి కొత్త దిశను చూపనుందని చెప్పారు. కంప్యూట్ రంగంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించడంతో పాటు విశాఖపట్నం నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురానుందని అన్నారు.

ఇప్పటి వరకు ముంబై, చెన్నై వంటి నగరాల్లో మాత్రమే పరిమితమైన డేటా సెంటర్లు ఇప్పుడు విశాఖలోకి రావడం ఒక పెద్ద మార్పు అని జీత్ అదానీ పేర్కొన్నారు. “ఇకపై విశాఖ భారతదేశానికి ఒక కొత్త డిజిటల్ గేట్‌వేగా మారుతుంది” అని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి ఉన్న నాయకత్వం వల్లే డిజిటల్ మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన ప్రశంసించారు.

“విశాఖ నగరం ఏఐ రివల్యూషన్‌కు నాంది పలికింది. భవిష్యత్తులో ఈ నగరం టెక్నాలజీ రంగంలో కీలక కేంద్రంగా ఎదుగుతుంది” అని జీత్ అదానీ అన్నారు. అదానీ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు.

ప్రజలకు, వ్యాపార రంగానికి, పరిశ్రమలకు అధునాతన ఏఐ సేవలను అందించడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌తో విశాఖపట్నం మాత్రమే కాదు… మొత్తం దేశం డిజిటల్ మార్గంలో మరింత వేగంగా ముందుకు సాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: ట్రంప్ వ్యాఖ్యలతో బులియన్ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు.. భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు!

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సద్దుమణిగే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బం…

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా-ఇరాన్ శాంతి సంకేతాలు... దలాల్ స్ట్రీట్‌లో బుల్ రన్.. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు! ప్రపంచ మార్కెట్లలో కొత్త ఉత్సాహం..

Stock Market: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చనే సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత స్టాక్ మ…