AP Water Resources: సముద్రం పాలవుతున్న 5 వేల టీఎంసీలు.. ప్రతి నీటి చుక్కను ఒడిసిపడతాం సీఎం చంద్రబాబు..!! Cm CBN: ప్రతి ఎకరాకూ నీరు అందేలా సాగునీటి సంఘాలు పనిచేయాలి.. సీఎం చంద్రబాబు! Swarna ward employees: APలో స్వర్ణ వార్డు ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్! తిరుమల లడ్డూ కల్తీపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నివేదికలను తొక్కిపెట్టి.. భక్తుల మనోభావాలతో.! CM Chandrababu: వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాదే... సీఎం చంద్రబాబు! ఏపీలో మహిళలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..! 50 వేల విలువైన సామాగ్రి ఉచితం! Kondaveeti Kota Utsavalu 2026: చారిత్రక వైభవానికి ఆధునిక హంగులు.. ఈనెల 7, 8 తేదీల్లో కొండవీటి కోట సంబరాలు! పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు.. ఘనంగా నిర్వహించిన హోం మంత్రి! భూగర్భంలో ఇరాన్ 'క్షిపణి నగరం'! ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ మేఘాలు! మెట్రో సెకండ్ ఫేజ్ ధమాకా.. హైదరాబాద్ నలుమూలలా మెట్రో పరుగులు.. ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు! AP Water Resources: సముద్రం పాలవుతున్న 5 వేల టీఎంసీలు.. ప్రతి నీటి చుక్కను ఒడిసిపడతాం సీఎం చంద్రబాబు..!! Cm CBN: ప్రతి ఎకరాకూ నీరు అందేలా సాగునీటి సంఘాలు పనిచేయాలి.. సీఎం చంద్రబాబు! Swarna ward employees: APలో స్వర్ణ వార్డు ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్! తిరుమల లడ్డూ కల్తీపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నివేదికలను తొక్కిపెట్టి.. భక్తుల మనోభావాలతో.! CM Chandrababu: వెంకటేశ్వర స్వామి భక్తుడిగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత నాదే... సీఎం చంద్రబాబు! ఏపీలో మహిళలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..! 50 వేల విలువైన సామాగ్రి ఉచితం! Kondaveeti Kota Utsavalu 2026: చారిత్రక వైభవానికి ఆధునిక హంగులు.. ఈనెల 7, 8 తేదీల్లో కొండవీటి కోట సంబరాలు! పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు.. ఘనంగా నిర్వహించిన హోం మంత్రి! భూగర్భంలో ఇరాన్ 'క్షిపణి నగరం'! ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ మేఘాలు! మెట్రో సెకండ్ ఫేజ్ ధమాకా.. హైదరాబాద్ నలుమూలలా మెట్రో పరుగులు.. ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు!

గుంటూరు రోడ్లపై జంగిల్ రాజ… బూతుల నేతల హడావిడి..

జగన్ పరామర్శ యాత్ర ఒక టీవీ సీరియల్…బూతుల నేతలకు జగన్ సంఘీభావం..ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీ

Published : 2026-02-05 08:30:00

జగన్ పరామర్శ యాత్ర ఒక టీవీ సీరియల్…

బూతుల నేతలకు జగన్ సంఘీభావం..

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి జగన్ వెళ్లిన పరామర్శ యాత్రను ఆయన ఒక పెద్ద డ్రామాగా అభివర్ణించారు. కేవలం 34 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా, జగన్ ఏకంగా 9 గంటల పాటు సాగదీయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మునిగిపోతున్న వైకాపా నావను కాపాడుకోవడానికి, ప్రజల్లో లేని బలాన్ని ఉన్నట్లు చూపించుకోవడానికే జగన్ ఈ విధంగా టీవీ సీరియల్ తరహాలో ప్రయాణాన్ని సాగించారని ఎద్దేవా చేశారు.

బూతులు మాట్లాడే నేతలకు బుద్ధి చెప్పాల్సింది పోయి, జగన్ వారికి అండగా నిలబడటం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గతంలో గంజాయి, మద్యం కేసుల్లో అరెస్టైన వారిని పరామర్శించిన జగన్, ఇప్పుడు అసభ్యకరంగా మాట్లాడే నాయకులకు మద్దతు తెలపడం ఆయన నైజానికి నిదర్శనమని అన్నారు. అంబటి రాంబాబు చేసిన మురికి వ్యాఖ్యలపై నిలదీయడానికి వెళ్లిన తెలుగుదేశం కార్యకర్తలపై ఎదురు కేసులు పెట్టడమే కాకుండా, దానిని దాడిగా చిత్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ తావు ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల జగన్ పాలనను 'జంగిల్ రాజ్' (అడవి పాలన) తో పోల్చిన అచ్చెన్నాయుడు, ఆనాడు జరిగిన దాడులను గుర్తు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర జగన్ దని విమర్శించారు. అరాచక పాలన వల్ల పరిశ్రమలు రాష్ట్రం వదిలి పారిపోయాయని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పి 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మళ్లీ అభివృద్ధి జరుగుతుంటే, దానిని అడ్డుకోవడానికి జగన్ అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

జగన్ వైఖరి వల్ల సామాన్య ప్రజలు గుంటూరు రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, సాక్షి మీడియా ఫోజుల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. తన నాయకులను రెచ్చగొట్టి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి సృష్టించాలని జగన్ చూస్తున్నారని, ఇలాంటి కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. బూతుల నేతలకు సంఘీభావం తెలపడం మానేసి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.

జగన్ కు నిజంగా ప్రజా సమస్యల మీద దమ్ముంటే రోడ్లపై డ్రామాలు చేయడం ఆపి అసెంబ్లీకి రావాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి చర్చల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. అక్కడ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బయట యాత్రలు చేయడం అంటే ప్రజల నుండి పారిపోవడమేనని అన్నారు. ఇకనైనా జగన్ తన పద్ధతి మార్చుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని మంత్రి హితవు పలికారు.

Spotlight

Read More →