Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! Cockfighting AP: సంక్రాంతి వేళ కోడిపందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Elephant threat: గ్రామాలపై ఏనుగు ముప్పు.. 13 మంది మృతి.. . అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు.. అయినా తగ్గని! Water heaters: వాటర్ హీటర్‌తో జాగ్రత్త.. ప్లాస్టిక్ బకెట్ తప్పనిసరి.. UPలో షాక్ ఘటన! Grok: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. గ్రోక్ నివేదికపై అసంతృప్తి! మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు..!! Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా! Veterinary News: గొర్రె రక్తంతో పాము విషానికి మందా..? నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! Cockfighting AP: సంక్రాంతి వేళ కోడిపందాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!! Sankranthi: సన్నాయి మేళాలు మౌనం.. డూడూ బసవన్నలకు దూరమవుతున్న జనం! Elephant threat: గ్రామాలపై ఏనుగు ముప్పు.. 13 మంది మృతి.. . అడవిలోకి తరలించేందుకు ప్రయత్నాలు.. అయినా తగ్గని! Water heaters: వాటర్ హీటర్‌తో జాగ్రత్త.. ప్లాస్టిక్ బకెట్ తప్పనిసరి.. UPలో షాక్ ఘటన! Grok: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సీరియస్.. గ్రోక్ నివేదికపై అసంతృప్తి! మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక మలుపు..!! Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా! Veterinary News: గొర్రె రక్తంతో పాము విషానికి మందా..? నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! Kondagattu Anjanna: కొండగట్టు అభివృద్ధికి భారీ నిధులు.. అంజన్న ఆశీస్సులతో సేవ.. పవన్ కళ్యాణ్!

చరిత్ర సృష్టించిన ప్రపంచ తెలుగు మహాసభలు… మారిషస్‌ అధ్యక్షుడు – మన పండక్కి ఆ దేశంలో హాలిడే ఇచ్చారట..!

2026-01-04 16:53:00
TTD: 25 ఏళ్ల శ్రీవారి సేవకు నూతన విస్తరణ…! మొబైల్ జల ప్రసాదంతో టీటీడీ!

గుంటూరు వేదికగా జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు కనుల పండువగా కొనసాగాయి. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటేలా నిర్వహించిన ఈ మహాసభలు తెలుగువారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సభలకు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా తొలిసారిగా ఒక దేశాధ్యక్షుడు ఈ మహాసభల్లో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మారింది.

ఇంద్రకీలాద్రిపై కొత్త నిబంధన: వీఐపీలైనా టికెట్ కొనాల్సిందే.. దుర్గమ్మ ఆలయ అధికారుల కీలక నిర్ణయం!

మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ సతీసమేతంగా మహాసభలకు హాజరయ్యారు. ఆయనకు నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అశ్వరథంపై ఆయనను ప్రధాన వేదిక వరకు తీసుకువచ్చి ఆత్మీయంగా ఆహ్వానించారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి నమస్కరించిన ధరమ్ బీర్ గోకుల్, అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి తెలుగువారిపై తన అభిమానాన్ని చాటారు. ఈ దృశ్యాలు సభకు హాజరైన వారిని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

Parenting Awareness: మీ పిల్లలు చూస్తున్న కార్టూన్లపై ఏ షోకు ఎంత రేటింగ్ ఉందో తెలుసుకోవాలని ఉందా? అది చూస్తే మీకే ప్రాబ్లమ్!

సభ ప్రారంభంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆంధ్ర సాహిత్యం, చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు సభకు ప్రత్యేక వైభవాన్ని తీసుకొచ్చాయి. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రతీ ఒక్కరికీ గుర్తు చేసేలా ఈ కార్యక్రమాలు సాగాయి.

Amaravati: అమరావతి ఎఫెక్ట్.. VJA–GNT కారిడార్‌లో రియల్ ఎస్టేట్ బూమ్!

ఈ సందర్భంగా మారిషస్ అధ్యక్షుడు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఎంతో గొప్పదని తెలిపారు. దేశంలో మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. మారిషస్‌లో ఉగాది పండుగను జాతీయ సెలవుగా ప్రకటించామని, తెలుగు సంస్కృతి అక్కడి జీవనశైలిలో ఒక భాగంగా మారిందని చెప్పారు. మారిషస్‌లో తెలుగును తృతీయ భాషగా గుర్తించి, విద్యా వ్యవస్థలోనూ ప్రోత్సహిస్తున్నామని వివరించారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన నాయకులను ఆయన ప్రశంసించారు.

కొత్త ఏడాదిలో కొత్త పన్ను.. వాహనదారులకు షాక్! కొత్త బండి కొనాలంటే అదనపు భారం.. బైక్, స్కూటీ కొంటే!

తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత మనందరిదేనని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నా, మన పండుగలను మర్చిపోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగువారే మన పండుగలను గొప్పగా జరుపుకుంటున్నారని, తెలుగు రాష్ట్రాల్లోనూ అదే స్ఫూర్తి రావాలని కోరారు.

నగరవాసులకు ఎగిరిగంతేసే వార్త.. ఓఆర్ఆర్ చుట్టూ మహా మెట్రో.. ఆ 22 చోట్ల స్టేషన్ల నిర్మాణం.. 360 డిగ్రీల కనెక్టివిటీ!

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య మాట్లాడుతూ, మాతృభాష తెలుగును ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలని సూచించారు. ఆంగ్ల భాష అవసరమే అయినా, మాతృభాషను విస్మరించడం సరైంది కాదన్నారు. తెలుగు భాష పరిరక్షణకు అందరూ కలిసి నడుం బిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

2036 Olympics : భారత్ 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి సిద్ధం.. మోదీ!

జనసేన ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు భాషాభివృద్ధికి మారిషస్ దేశం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అక్కడ ఒకటి నుంచి పీజీ స్థాయి వరకు తెలుగు నేర్పిస్తున్న విధానం ప్రశంసనీయమని చెప్పారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

చికెన్ లివర్ vs మటన్ లివర్... ఏది ఆరోగ్యానికి మేలు? వీరికి విషంతో సమానం.!

ఈ మహాసభల్లో తెలుగువారి కోసం సేవలందిస్తున్న పలువురు ప్రముఖులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. దేశ విదేశాల్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్నవారిని పురస్కారాలతో గౌరవించారు. సాహిత్యం, సంస్కృతి, కళలు ఒకే వేదికపై కలిసిన ఈ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచాయి. గుంటూరు వేదికగా సాగుతున్న ఈ సంబరాలు మరికొన్ని రోజుల పాటు తెలుగు భాష వైభవాన్ని చాటుతూనే ఉండనున్నాయి.

World Political: ఒక్క నిర్ణయం… వెనిజులా మ్యాప్‌నే మార్చేసేంత పవర్ ట్రంప్‌దేనా?
Prawns Health: రొయ్యల్లో ఉండే నల్ల నరం… ఇంత పెద్ద సమస్యకు కారణమవుతుందా? తెలుసుకోకపోతే ఇక అంతే..!

Spotlight

Read More →