భారతీయ రైల్వేలు (Indian Railways) అంటే సామాన్యుడి ప్రయాణ సాధనం. లక్షలాది మంది ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని మరియు మెరుగైన అనుభవాన్ని అందించడానికి రైల్వే శాఖ టికెట్ బుకింగ్ నియమాల్లో (Ticket booking rules) కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త నియమాలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఈ మార్పులు ముఖ్యంగా వృద్ధులకు, మహిళలకు మరియు గర్భిణీ స్త్రీలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. రైలు ప్రయాణంలో ప్రయాణీకులు తరచుగా ఎదుర్కొనే సమస్య లోయర్ బెర్తుల లభ్యత. సీనియర్ సిటిజన్లు ఎప్పుడూ లోయర్ బెర్త్లనే కోరుకుంటారు. దీనివల్ల ముసలివారికి పైకి ఎక్కే కష్టం తప్పుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రైల్వేలు తమ రిజర్వేషన్ వ్యవస్థను (Reservation system) మెరుగుపరిచాయి.
ప్రాధాన్యత ఎవరికంటే?
60 ఏళ్లు పైబడిన (Above 60 years) సీనియర్ సిటిజన్లు.
45 ఏళ్లు పైబడిన (Above 45 years) మహిళలు.
గర్భిణీ స్త్రీలకు (Pregnant women).
ఈ కొత్త వ్యవస్థ కింద, పై చెప్పిన వర్గాల వారికి లోయర్ బెర్తుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయితే, ఇది సీటు లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ అందుబాటులో లేకపోయినా, తర్వాత రైలులో సీటు ఖాళీగా ఉంటే, టి.టి.ఈ. (TTE) అటువంటి ప్రయాణీకులకు దిగువ బెర్త్ను కేటాయించే అవకాశం ఉంది.
లోయర్ బెర్త్ లేకుండా ప్రయాణించకూడదనుకునే సీనియర్ సిటిజన్లకు రైల్వేలు ఒక కొత్త ఆప్షన్ను జోడించింది. 'లోయర్ బెర్త్ అందుబాటులో ఉంటేనే బుక్ చేసుకోండి' అనే ఆప్షన్ ఎంచుకుంటే, రైలులో లోయర్ బెర్త్లు అందుబాటులో ఉంటేనే టిక్కెట్లు బుక్ చేయబడతాయి.
లేకపోతే, బుకింగ్ ప్రాసెస్ (Booking process) ముందుకు సాగదు. దీనివల్ల వృద్ధులు అనవసరంగా అప్పర్ లేదా మిడిల్ బెర్త్లు బుక్ చేసుకొని ఇబ్బంది పడే సమస్య తప్పుతుంది. ప్రయాణీకుల సౌకర్యం కోసం రైల్వేలు నిద్రించే (Sleeping) మరియు కూర్చునే సమయాలకు సంబంధించి స్పష్టమైన నియమాలను తీసుకొచ్చాయి.
నిద్ర సమయాన్ని ఇప్పుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలుగా నిర్ణయించారు. ఈ సమయంలో ప్రయాణీకులు తమకు కేటాయించిన బెర్తులపై విశ్రాంతి తీసుకోవచ్చు. పగటిపూట ఇతరులకు అసౌకర్యాన్ని నివారించడానికి, అందరు ప్రయాణీకులు తమ సీట్లపై కేవలం కూర్చోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.
పగటిపూట, సైడ్ లోయర్ బెర్త్ను RAC ప్రయాణీకులు మరియు సైడ్ అప్పర్ బెర్త్ను బుక్ చేసుకున్న ప్రయాణీకులు పంచుకుంటారు. కానీ రాత్రిపూట మాత్రం లోయర్ బెర్త్ను ఆ సీటు టిక్కెట్ కొన్న ప్రయాణీకుడు మాత్రమే ఆక్రమించుకుంటారు.
టికెట్ బుకింగ్ విషయంలో కూడా రైల్వే ఒక కీలకమైన మార్పు చేసింది. గతంలో రైల్వే టిక్కెట్లను ప్రయాణ తేదీకి 120 రోజుల ముందుగానే బుక్ చేసుకునేందుకు అనుమతి ఉండేది.
ఇప్పుడు ఈ కాల వ్యవధిని కేవలం 60 రోజులకు తగ్గించారు. ఈ మార్పు రద్దు సమస్యలను (Cancellation problems) తగ్గిస్తుందని, బుకింగ్ ప్రక్రియను (Booking process) మరింత క్రమబద్దీకరిస్తుందని రైల్వే శాఖ ఆశిస్తోంది. ఈ కొత్త నియమాలు ప్రయాణీకులకు చాలా ఉపశమనం కల్పిస్తాయని చెప్పవచ్చు.