Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Flights: విదేశీ ప్రయాణికులకు షాక్... ఒక్కరోజే 180 సర్వీసులు రద్దు! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? Ongole Highway: ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! 108 సిబ్బంది సమయస్ఫూర్తితో ఐదుగురు సేఫ్! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. Vandebharath: ప్రయాణికులకు అలర్ట్... వందేభారత్ రైళ్ల టైమింగ్స్‌లో మార్పు! Railway Rules: మెట్రో తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంట్రీ..! కొత్త నిబంధనలు ఇవే! Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం! పలు రైళ్ల రద్దు.. ప్రత్యామ్నాయంగా కొత్త సర్వీసులు! Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్! ఆధార్ అనుసంధానంపై రైల్వే కీలక నిర్ణయం! Indigo: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో టెన్షన్ టెన్షన్.. ఏపీ మంత్రి, ఎమ్మెల్యేలతో వెళ్తున్న ఇండిగో విమానానికి తప్పిన ముప్పు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Flights: విదేశీ ప్రయాణికులకు షాక్... ఒక్కరోజే 180 సర్వీసులు రద్దు! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే?

Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..!

 శబరిమల యాత్ర సీజన్‌ ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో శబరిమ

Published : 2025-11-07 18:48:00
చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

శబరిమల యాత్ర సీజన్‌ ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో శబరిమల పాదయాత్రకు బయల్దేరుతారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది నవంబర్‌ నుండి జనవరి వరకు మొత్తం 60 ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల వివిధ పట్టణాల నుండి కేరళలోని కొల్లాం వరకు, తిరిగి కొల్లాం నుండి తిరుగు ప్రయాణంగా నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే వారాంతాల్లో, ప్రత్యేక పండుగ దినాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Modi ji: మోదీ జీ మీ స్కిన్‌కేర్ రహస్యం ఏంటి.. హర్లీన్ ప్రశ్నకు స్నేహ్ రాణా స్మార్ట్ సమాధానం!

చర్లపల్లి-కొల్లాం మార్గంలో నవంబర్‌ 17, 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. తిరుగు దిశలో కొల్లాం-చర్లపల్లి రైళ్లు నవంబర్‌ 19, 26, డిసెంబర్‌ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో నడవనున్నాయి. ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడూరు, రేణిగుంట మార్గంలో ప్రయాణిస్తాయి. నర్సాపూర్‌ మార్గంలోనూ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్‌ నుండి కొల్లాం వైపు రైళ్లు బయలుదేరతాయి. తిరుగు దిశలో నవంబర్‌ 18, 25, 30, డిసెంబర్‌ 9, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో కొల్లాం-నర్సాపూర్‌ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

Team meets President: రాష్ట్రపతిని కలిసిన WWC విజేత భారత మహిళల జట్టు.. భారత గర్వం మీరు అంటూ ముర్ము ప్రశంస!

ఇక మచిలీపట్నం ప్రాంతానికి చెందిన భక్తుల కోసం కూడా ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే నిర్ణయించింది. నవంబర్‌ 14, 21, 28, డిసెంబర్‌ 26, జనవరి 2 తేదీల్లో మచిలీపట్నం నుండి కొల్లాం వైపు రైళ్లు నడుస్తాయి. తిరుగు దిశలో నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 28, జనవరి 4 తేదీల్లో కొల్లాం నుండి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి. అదనంగా, గుంటూరు, నంద్యాల, కడప మీదుగా వెళ్లే మరో మార్గంలో కూడా రైళ్లు నడుస్తాయి. డిసెంబర్‌ 5, 12, 19, జనవరి 9, 16 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం రైళ్లు, అలాగే డిసెంబర్‌ 7, 14, 21, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం-మచిలీపట్నం రైళ్లు అందుబాటులో ఉంటాయి.

World Cup winner: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన శ్రీ చరణి ఘన సత్కారం – సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కోట్ల బహుమతి, స్థలం, ఉద్యోగం!

రైల్వే అధికారులు భక్తులు ముందుగానే తమ టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకోవాలని సూచించారు. శబరిమల సీజన్‌లో ప్రయాణికుల భద్రత, సౌకర్యం దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి రైలులో తగిన భద్రతా సిబ్బంది, అవసరమైన సదుపాయాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లు నడపడం ద్వారా భక్తులు బస్సులు, ప్రైవేట్‌ వాహనాల రద్దీని తప్పించుకోవడంతో పాటు సులభంగా, సురక్షితంగా తమ యాత్రను పూర్తి చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం భక్తులకు నిజమైన బహుమతిగా నిలుస్తుందని అయ్యప్ప భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Jobs: గ్రామీణ యువతకు బంగారు అవకాశమిది..! ప్రభుత్వ రాయితీలతో స్వయం ఉపాధి కల!
Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..!
Andhra Pradesh Tourism: ఏపీకి రండి, పెట్టుబడులు పెట్టండి.. లండన్‌లో పెట్టుబడిదారులకు పర్యాటక మంత్రి దుర్గేష్ ఆహ్వానం!!
Google: గూగుల్‌లో ఇవి వెతికితే జైలు శిక్ష తప్పదు..! చట్టపరంగా నిషేధిత సెర్చ్‌లు ఇవే..!
Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!!
హార్ట్‌బీట్‌ నుంచి నిద్ర వరకు… అన్నీ చెప్పే స్మార్ట్‌వాచ్‌! కేవలం రూ.599 కే...

Spotlight

Read More →