ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద పర్యాటక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో సోంపేట, తవిటి మండలాల్లోని మూడు ప్రధాన చిత్తడి నేలలను కలుపుతూ ఒక ప్రత్యేక పర్యాటక మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణం, జీవవైవిధ్యం రక్షించబడుతూ, రాష్ట్రంలో పర్యాటక అవకాశాలు పెంపొందించబడతాయి అని అధికారులు తెలిపారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 16 చిత్తడి నేలలను గుర్తించి వాటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున చిత్తడి నేలలను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, కొల్లేరు సరస్సు మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారని తెలపడం జరిగినది.
చిత్తడి నేలలు పర్యావరణానికి, జీవవైవిధ్యానికి చాలా ముఖ్యమైనవని ఇవి సహజంగా కార్బన్ నిల్వలుగా పనిచేస్తాయి. అలాగే, చేపలు, పక్షులు, ఇతర జంతువులకు ఆవాసాలుగా కూడా ఉపయోగపడతాయి. అందుకే రాష్ట్రం ఈ చిత్తడి నేలలను కాపాడటానికి ప్రత్యేక దృష్టి పెడుతుందని కొల్లేరు సరస్సు లాంటి మరిన్ని చిత్తడి నేలలకు రాంసర్ తరహా గుర్తింపు దక్కేలా అటవీ శాఖ, వన్యప్రాణి విభాగం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధిపై కూడా ఇప్పటికే దృష్టి పెట్టారని గండికోట ప్రాజెక్టుకు ఆగస్టులో శంఖుస్థాపన నిర్వహించబడింది. ఈ కొత్త చిత్తడి పర్యాటక ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రం భూగోళిక, పర్యావరణ, పర్యాటక రంగాలలో కొత్త మైలురాయిని చేరనుందని అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు అభివృద్ధి చేస్తూ ప్రకృతిని రక్షిస్తూ పర్యాటకులు, స్థానికులు ఇద్దరికీ లాభం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రాజెక్ట్ వల్ల ప్రాంతీయ వన్యప్రాణులు, చేపలు, పక్షులు, పచ్చని ప్రకృతి మరింత బలపడనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక, రాష్ట్రానికి కొత్త పర్యాటక కేంద్రాలు, స్థానిక ఆర్థికాభివృద్ధి, వన్యప్రాణి సంరక్షణ సాధ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు.