LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Technology

Artemis 2: ఆర్టెమిస్-2 మిషన్‌లో కీలక దశ.. 40 నిమిషాల పాటు నిలిచిపోనున్న కమ్యూనికేషన్..

Artemis 2: నాసా చేపట్టిన ఆర్టెమిస్‌-2 మిషన్‌.. చందమామ దిశగా ప్రయాణాన్ని సాగిస్తోంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్‌ వ్యోమనౌక.

AndhraPravasi News Desk 1 min read
Artemis 2: ఆర్టెమిస్-2 మిషన్‌లో కీలక దశ.. 40 నిమిషాల పాటు నిలిచిపోనున్న కమ్యూనికేషన్..

ఆర్టెమిస్‌-2.. కట్‌ కానున్న సంబంధాలు.. 

చంద్రుడి దిశగా మానవ యాత్రను మరోసారి ప్రారంభించేందుకు NASA చేపట్టిన Artemis II మిషన్‌ కీలక దశలోకి అడుగుపెడుతోంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్‌ వ్యోమనౌక చంద్రుడి చుట్టూ ప్రయాణిస్తూ, జాబిల్లి వెనుక భాగానికి చేరుకునే సమయంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఎదురుకానుంది.

అంతరిక్ష యాత్రలో భాగంగా ఒరాయన్‌ వ్యోమనౌక చంద్రుడి వెనుక వైపుకు వెళ్లినప్పుడు, భూమిపై ఉన్న హ్యూస్టన్ మిషన్ కంట్రోల్‌తో సంబంధాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ సమయంలో దాదాపు 40 నిమిషాల పాటు ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదని అధికారులు వెల్లడించారు.

ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌కు కారణం చంద్రుడి వెనుక భాగం. ఆ ప్రాంతంలోకి వ్యోమనౌక వెళ్లినప్పుడు, భూమికి నేరుగా సంకేతాలు పంపడం సాధ్యం కాదు. దీంతో కొంతసేపు వ్యోమగాములు పూర్తిగా స్వతంత్రంగా ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ కీలక దశ చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయం అంతరిక్ష యాత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా ఉండనుంది.

అయితే ఇది ముందే అంచనా వేసిన పరిస్థితి కావడంతో, వ్యోమగాములు అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తారని నాసా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ దశ విజయవంతంగా పూర్తైతే, మానవులను మళ్లీ చంద్రుడిపైకి పంపే దిశగా ఆర్టెమిస్ కార్యక్రమానికి ఇది మరో ముఖ్యమైన ముందడుగు అవుతుంది.

Be the first to react

More Coverage

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారతదేశంలో 5G విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 6G నెట్‌వర్క్ ప్రణాళి…