Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే? Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!! UIDAI: ఆధార్ కార్డు కోసం ఇక వెబ్‌సైట్ అవసరం లేదు..! వాట్సప్ చాలూ! Technology News: పాత ల్యాప్‌టాప్ అమ్మే ముందు ఇది తప్పక చేయండి… లేకపోతే అంతే!! ePassport India: భారతదేశంలో e-Passport ప్రారంభం! దరఖాస్తు... పూర్తి వివరాలు! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు! Musks reply : తప్పు పెన్నుది కాదు రాసేవాడిదే.. భారత్‌కు మస్క్ పరోక్ష సమాధానం! Cyber Crime: అమాయకుల ఖాతాలతో రూ. కోట్ల మోసం…! విజయవాడలో అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు! Samsung: బాహుబలి బ్యాటరీతో ఫోన్‌ను లాంచ్‌ చేయనున్న శామ్‌సంగ్‌! ఒక సారి ఛార్జ్ చేస్తే చాలు..! ఎలాన్ మస్క్ బికినీ ఫొటోలు నెట్టింట హల్‌చల్.. వాటిని చూసి మస్క్ ఇచ్చిన రియాక్షన్ ఇదే! Technology News: గూగుల్ ఉచిత సేవల వెనుక అసలు కథ.. ఆదాయం ఎలా వస్తుందంటే? Tech News: కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? ఇంక అంతే… మీ ఫోన్ కి పెద్ద ముప్పే..!! UIDAI: ఆధార్ కార్డు కోసం ఇక వెబ్‌సైట్ అవసరం లేదు..! వాట్సప్ చాలూ! Technology News: పాత ల్యాప్‌టాప్ అమ్మే ముందు ఇది తప్పక చేయండి… లేకపోతే అంతే!! ePassport India: భారతదేశంలో e-Passport ప్రారంభం! దరఖాస్తు... పూర్తి వివరాలు! Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు! Musks reply : తప్పు పెన్నుది కాదు రాసేవాడిదే.. భారత్‌కు మస్క్ పరోక్ష సమాధానం! Cyber Crime: అమాయకుల ఖాతాలతో రూ. కోట్ల మోసం…! విజయవాడలో అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు! Samsung: బాహుబలి బ్యాటరీతో ఫోన్‌ను లాంచ్‌ చేయనున్న శామ్‌సంగ్‌! ఒక సారి ఛార్జ్ చేస్తే చాలు..! ఎలాన్ మస్క్ బికినీ ఫొటోలు నెట్టింట హల్‌చల్.. వాటిని చూసి మస్క్ ఇచ్చిన రియాక్షన్ ఇదే!

బీఎస్ఎన్ఎల్ యూజర్లకు పండగే.. ఇది ఉంటే చాలు, ఫాస్ట్ నెట్‌వర్క్ మీకే..!

2026-01-02 15:56:00
Auto market: SUVలదే దూకుడు.. దేశీయ ఆటో మార్కెట్లో 55.8% వాటా!

కొత్త ఏడాది సందర్భంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు  ఉపయోగపడే శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కీలక సదుపాయాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే వాయిస్ ఓవర్ వైఫై లేదా సాధారణంగా చెప్పుకునే వైఫై కాలింగ్ సేవ. మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ సరిగా అందని ప్రాంతాల్లోనూ, కేవలం వైఫై కనెక్షన్ ఉంటే చాలు కాల్స్ చేయగలిగేలా ఈ సదుపాయం పనిచేస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి ఇది ఎంతో ఊరట కలిగించే అంశంగా మారనుంది.

AP Government: వార్డు సచివాలయాల్లో హోదాల మార్పు…! ఇకపై అలా పిలవాలి.. ఉత్తర్వులు జారీ!

బీఎస్ఎన్ఎల్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, దేశంలోని అన్ని టెలికాం సర్కిల్స్‌లో ఈ వై-ఫై కాలింగ్(VoWiFi) సేవను ప్రారంభించారు. ఇప్పటివరకు సిగ్నల్ బలహీనంగా ఉండే ఇళ్లలో, బహుళ అంతస్తుల భవనాల్లో, బేస్‌మెంట్‌లలో కాల్స్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులకు ఇక ఆ సమస్యలు తగ్గనున్నాయి. వైఫై కనెక్షన్ ఉన్నచోట ఎక్కడైనా నాణ్యమైన వాయిస్ కాల్స్ చేయవచ్చు. అంతేకాదు, ఈ సేవ ద్వారా కేవలం కాల్స్ మాత్రమే కాకుండా ఎస్ఎంఎస్ సందేశాలను కూడా పంపే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది.

Book Festival: నేటి నుంచి విజయవాడలో పుస్తకాల పండుగ – 36వ బుక్ ఫెస్టివల్‌కు ఘన ఆరంభం ఎక్కడంటే..!!

ఈ కొత్త ఫీచర్‌ను ఆధునిక ఐఎంఎస్ సాంకేతికత ఆధారంగా అభివృద్ధి చేసినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. దీనిని ఉపయోగించేందుకు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ సెట్టింగ్స్‌కి వెళ్లి, నెట్‌వర్క్ లేదా కనెక్షన్స్ విభాగంలో ఉన్న వైఫై కాలింగ్ ఆప్షన్‌ను ఆన్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సేవను బీఎస్ఎన్ఎల్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అదనపు ఛార్జీలు లేకుండా, ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లతోనే ఈ సదుపాయం పొందవచ్చు.

Airport Alert: గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్… రెండు విమానాలు దారి మళ్లింపు!

నెట్‌వర్క్ కవరేజ్ పూర్తిగా లేని పరిస్థితుల్లో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్ చేయగలిగేలా ఈ ఫీచర్ రూపొందించబడింది. పెద్ద భవనాలు, మందపాటి గోడలు, భూగర్భ ప్రాంతాలు వంటి చోట్ల సెల్యులార్ సిగ్నల్స్ సరిగా అందకపోయినా, వైఫై ఉంటే చాలు కాల్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు, సెల్యులార్ నెట్‌వర్క్‌పై ఉండే రద్దీ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని టెలికాం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఏపీ ఎకానమీ 2026.. సవాళ్లను అధిగమిస్తూ.. రికార్డు వసూళ్ల వైపు! బలమైన రెవెన్యూ గ్రోత్‌తో..

ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ తన సేవలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 4జీ నెట్‌వర్క్ విస్తరణతో పాటు, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచే సాంకేతిక ఫీచర్లను వరుసగా ప్రవేశపెడుతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) గురించి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ నెలలో బీఎస్ఎన్ఎల్ లక్షలాది కొత్త వినియోగదారులను ఆకర్షించింది. ఇది ప్రభుత్వరంగ సంస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకం పెరుగుతున్నదానికి నిదర్శనంగా భావిస్తున్నారు.

Seed Axis Road: అమరావతికి కొత్త మార్గం… సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి.. పనులు పరిశీలించిన మంత్రి నారాయణ!
తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఈ రూట్లోనే..! విమానం కంటే తక్కువ ధరకే - గంటకు 180 కి.మీ వేగం!
Renu Desai : చిన్నారితో రేణూ దేశాయ్… న్యూ ఇయర్ ఫొటోలు వైరల్
Village Food Recipes: అమ్మమ్మ చేసే నాటు చిక్కుడు పచ్చడి వెనుక అసలు రహస్యం ఇదే… ఒక్కసారి తింటే మళ్లీ అదే కావాలనిపిస్తుంది!
కొత్త ఏడాది కానుక: జియో, ఎయిర్‌టెల్‌కు ధీటుగా రంగంలోకి బీఎస్‌ఎన్‌ఎల్! ఉచితంగా ఆ సేవలు..

Spotlight

Read More →