Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

AP Government: వార్డు సచివాలయాల్లో హోదాల మార్పు…! ఇకపై అలా పిలవాలి.. ఉత్తర్వులు జారీ!

2026-01-02 12:54:00
Auto market: SUVలదే దూకుడు.. దేశీయ ఆటో మార్కెట్లో 55.8% వాటా!


ఆంధ్రప్రదేశ్‌లో వార్డు సచివాలయాల వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న కొందరు వార్డు సచివాలయ కార్యదర్శుల హోదాల్లో మార్పులు చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శుల హోదాను ఇకపై “వార్డు డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులు”గా మారుస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్‌ కార్యదర్శులుగా ఉన్నవారు ఇకపై “వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్‌ కార్యదర్శులు”గా వ్యవహరించనున్నారు. ఈ హోదాల మార్పుకు సంబంధించిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించడంతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

గ్రీన్ కార్డుపై బాంబు పేల్చిన అమెరికా..! పెళ్లి చేసుకుంటే - ఇక ఆటలు సాగవు.. నిబంధనలు మారాయి!

ఈ మార్పులతో వార్డు సచివాలయాల్లో బాధ్యతల పంపిణీ మరింత స్పష్టంగా మారనుంది. ముఖ్యంగా వార్డు డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శుల బాధ్యతల్లో డేటా సేకరణ, నిర్వహణ, విశ్లేషణకు అధిక ప్రాధాన్యత కల్పించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల వివరాల అప్‌డేషన్, డిజిటల్ రికార్డుల నిర్వహణలో వీరి పాత్ర కీలకంగా ఉండనుంది. మరోవైపు, వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్‌ కార్యదర్శుల పరిధిలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యకు సంబంధించిన అంశాలు కూడా చేరనున్నాయి. పాఠశాలల సమాచారం, విద్యార్థుల వివరాలు, ప్రభుత్వ విద్యా పథకాల అమలు వంటి అంశాలపై వీరు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఈ మార్పుల వల్ల వార్డు సచివాలయాల పనితీరు మరింత మెరుగుపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అమరావతికి మహర్దశ.. E-13 రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్! కొండల మధ్య ఘాట్ రోడ్డు..

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, పట్టు, సహకార, మార్కెటింగ్‌ శాఖల ఎక్స్‌అఫిషియో స్పెషల్ సెక్రటరీగా ఉన్న బుడితి రాజశేఖర్‌ సేవలను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. 2025లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సేవలను 2026 వరకు కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆయనకు నెలకు రూ.3.50 లక్షల గౌరవ భృతిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన పశుసంవర్ధక, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలక శాఖల్లో అనుభవం దృష్ట్యా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మిడ్‌రేంజ్‌ ధరలో 200MP కెమెరా, 6500mAh బ్యాటరీతో 5G స్మార్ట్‌ఫోన్‌..! ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌తో..

అదేవిధంగా పరిశ్రమల రంగంలో సంస్కరణలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ప్రమాద ముప్పు (లో-హజర్డ్‌) కలిగిన పరిశ్రమలు ఇకపై తమ ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లను ప్రభుత్వ గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా చేయించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. థర్డ్ పార్టీ ఏజెన్సీల ఎంపిక, ఫైర్ ఎన్‌వోసీ జారీకి ముందు చేపట్టాల్సిన తనిఖీలు, గుర్తింపు కోసం దరఖాస్తు ప్రక్రియ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేశారు. ఈ కొత్త విధానం ద్వారా ఫైర్ సేఫ్టీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా మారనుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
 

భవిష్యత్తు నగరం.. ఏసీల అవసరం లేని సరికొత్త కూలింగ్ వ్యవస్థతో అద్భుతం! 30 నెలల్లో దేశానికే..
Delivery: 10 నిమిషాల డెలివరీ వెనుక అసలు రహస్యం ఇదే…! జొమాటో సీఈఓ సంచలన వ్యాఖ్యలు!
Fog blankets: తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు దుప్పటి… విమానాలు రద్దు, రహదారులపై ట్రాఫిక్ జామ్!
India Rail Updates: విజయవాడ–బెంగళూరు వందే భారత్ ఎందుకు ఆలస్యం? ఇప్పటివరకు పట్టాలెక్కని వెనుకకథ ఇదే!
Industrial Hub: ఏపీకి మరో ఇండస్ట్రియల్ హబ్…! ఆ జిల్లాకు మహర్దశ.. రూ.37,500 కోట్ల భారీ ప్రాజెక్ట్..!
Travel Relief: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ORR మీదుగా నేరుగా ఏపీకి RTC బస్సులు!

Spotlight

Read More →