High Speed Internet: ఇంటింటికీ డిజిటల్‌ సేవలు.. త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ కనెక్షన్లు, తక్కువ ధరకే..! Video Creating: వీడియో క్రియేషన్ ఇక చిటికెలో పని.. సీడ్యాన్స్ 2 అద్భుత ఫీచర్లు! Aadhaar Update: పాన్-ఆధార్ లింక్ కావడం లేదా? అయితే ఈ వివరాలు సరిచూసుకోండి! Unlimited 5G: అగ్రరాజ్యాలకు షాక్ ఇచ్చిన భారత్..! ప్రపంచంలోనే 5G క్యాపిటల్‌గా అవతరణ! Electric Highway: అద్భుతం... ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ హైవే! రోడ్డుపై వెళ్తుండగానే కార్లకు ఛార్జింగ్! Force Gurkha: భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారైన ఫోర్స్ గుర్ఖా...! వెనుక ఉన్న మెకానికల్ రహస్యాలు ఇవే! Supersonic Train: హైదరాబాద్ టు వైజాగ్ కేవలం 28 నిమిషాల్లో...! చైనా సూపర్‌సోనిక్ రైలు! Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లు జాగ్రత్త... ఈ 2 సెట్టింగ్స్ ఆఫ్ చేయకపోతే మీ బ్యాంక్ ఖాళీ! Professional Photographer: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలా? ఈ ఒక్క టెక్నిక్ నేర్చుకోండి! WhatsApp Governance : APTS ఆధ్వర్యంలో గుంటూరు RVR&JC ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా వాట్సాప్ గవర్నెన్స్ – సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు! High Speed Internet: ఇంటింటికీ డిజిటల్‌ సేవలు.. త్వరలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ కనెక్షన్లు, తక్కువ ధరకే..! Video Creating: వీడియో క్రియేషన్ ఇక చిటికెలో పని.. సీడ్యాన్స్ 2 అద్భుత ఫీచర్లు! Aadhaar Update: పాన్-ఆధార్ లింక్ కావడం లేదా? అయితే ఈ వివరాలు సరిచూసుకోండి! Unlimited 5G: అగ్రరాజ్యాలకు షాక్ ఇచ్చిన భారత్..! ప్రపంచంలోనే 5G క్యాపిటల్‌గా అవతరణ! Electric Highway: అద్భుతం... ప్రపంచంలోనే మొదటి ఎలక్ట్రిక్ హైవే! రోడ్డుపై వెళ్తుండగానే కార్లకు ఛార్జింగ్! Force Gurkha: భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారైన ఫోర్స్ గుర్ఖా...! వెనుక ఉన్న మెకానికల్ రహస్యాలు ఇవే! Supersonic Train: హైదరాబాద్ టు వైజాగ్ కేవలం 28 నిమిషాల్లో...! చైనా సూపర్‌సోనిక్ రైలు! Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లు జాగ్రత్త... ఈ 2 సెట్టింగ్స్ ఆఫ్ చేయకపోతే మీ బ్యాంక్ ఖాళీ! Professional Photographer: ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాలా? ఈ ఒక్క టెక్నిక్ నేర్చుకోండి! WhatsApp Governance : APTS ఆధ్వర్యంలో గుంటూరు RVR&JC ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా వాట్సాప్ గవర్నెన్స్ – సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సు!

Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!

కేంద్ర ప్రభుత్వం, టెలికాం సంస్థలు వేగంగా డిజిటల్ ఇండియాకి దూసుకుపోతున్నప్పటికీ… దేశంలో ఇంకా వేలాది గ్రామాలు మొబైల్ సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయంటే ఆశ్చర్యంగాన

Published : 2025-11-18 17:38:00
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు హెచ్చరిక.. స్కామ్ సందేశాలను గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి!!

కేంద్ర ప్రభుత్వం, టెలికాం సంస్థలు వేగంగా డిజిటల్ ఇండియాకి దూసుకుపోతున్నప్పటికీ… దేశంలో ఇంకా వేలాది గ్రామాలు మొబైల్ సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తున్నాయంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం 2024 సెప్టెంబర్ నాటికి భారత్‌లో 21,000కి పైగా గ్రామాలకు ఇప్పటికీ మొబైల్ కనెక్టివిటీ అందలేదు. అంటే ఆ గ్రామాల్లో కాల్స్ చేయడం, ఇంటర్నెట్ వాడటం, అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇవ్వడం వంటి ప్రాథమిక సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో లేవన్న మాట. ఈ పరిస్థితి డిజిటల్ యుగంలో ఎంత పెద్ద లోటో అర్థం చేసుకోవచ్చు.

US Visa: 2026 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం అమెరికా ప్రత్యేక వీసా ప్రాధాన్యత విధానం ప్రకటించిన ట్రంప్!!

ఇటీవల లద్దాఖ్‌లోని మారుమూల గ్రామాలైన మాన్, మెరాక్ ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ మొబైల్ సేవలను ప్రారంభించిన విషయం ప్రస్తావనీయమే. ఈ గ్రామాలు పర్వతాల మధ్య, వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో నెట్‌వర్క్ టవర్లు నిర్మించడం చాలా క్లిష్టమైన పని. ప్రత్యేక పరికరాలు, సాంకేతిక నైపుణ్యం, భారీ వ్యయం అవసరం. అయినప్పటికీ అక్కడివాళ్లకు కనెక్టివిటీ అందించేందుకు ఆపరేటర్లు ముందుకు రావడం మంచి అభివృద్ధి సంకేతం. లడ్డాఖ్‌ పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడ మొబైల్ సేవల కొరత పర్యాటకులకు కూడా ఇబ్బందులు కలిగించేది. కొత్తగా వచ్చిన సేవలతో కొంత ఉపశమనం లభించింది.

ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు!

అయితే దేశంలో మొబైల్ నెట్‌వర్క్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో ఒడిశా అగ్రస్థానంలో ఉంది. అక్కడే దాదాపు 6,000 గ్రామాల్లో ఇప్పటికీ మొబైల్ సేవలు పనిచేయడం లేదు. దానికి ప్రధాన కారణాలు దట్టమైన అడవులు, పర్వతాలు, లోతైన లోయలు. ఇలాంటి ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయడమే కాక, వాటికి అవసరమైన విద్యుత్, ఫైబర్ కనెక్షన్, భద్రత వంటి అంశాలు కూడా పెద్ద సవాల్ అవుతున్నాయి.

Cyber Fraud: SBI ఖాతాదారులపై తాజా స్కామ్‌! లింక్ క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, నార్త్-ఈస్ట్రన్ స్టేట్స్‌లోనూ పరిస్థితి అంతే. ఎన్నో గ్రామాలు ఇప్పటికీ టెక్నాలజీకి దూరంగానే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ‘యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్’ (USOF) ద్వారా వేలాది టవర్లు ఏర్పాటు చేసే పనిలో ఉన్నప్పటికీ, భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల చట్ట పరిమితులు, మావోయిస్టు ప్రభావం వంటి కారణాలతో కొన్ని ప్రాజెక్టులు స్లోగానే సాగుతున్నాయి.

Train Ticket: ట్రైన్ టికెట్ బుకింగ్‌లో భారీ మార్పులు... వెంటనే అమలులోకి!

మొబైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఆ గ్రామాల ప్రజలు విద్య, ఆరోగ్యం, అత్యవసర సేవలు, డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ గవర్నమెంట్ సేవలన్నింటినీ కోల్పోతున్నారు. ఈ డిజిటల్ గ్యాప్ తొలగకపోతే దేశం మొత్తం సమానంగా అభివృద్ధి చెందడం కష్టం.

Egg: ఆకాశాన్ని అంటుతున్న గుడ్డు ధరలు..! చికెన్ తగ్గినా గుడ్డు పైపైకి… ఎందుకో తెలుసా?

భారతదేశం 5జీ, 6జీ వైపు సాగుతున్నా… ఈ 21 వేల గ్రామాలకు కనీస మొబైల్ సిగ్నల్ అందించే వరకు నిజమైన డిజిటల్ ఇండియా పూర్తి కాదు. ప్రభుత్వం, టెలికాం కంపెనీలు, స్థానిక పరిపాలన కలిసి పనిచేస్తేనే ఈ లోటు నిండుతుంది. ఇలాంటి పరిస్థితిలో లద్దాఖ్ గ్రామాల్లో ప్రారంభమైన సేవలు ఒక ఆశాజనక అడుగు మాత్రమే… ఇంకా దేశం మొత్తం కనెక్ట్ కావాలంటే పెద్ద ప్రయాణం మిగిలే ఉంది.

Sim Card: 5 ఏళ్లుగా ఒకే మొబైల్ నంబర్ వాడుతున్నారా? అయితే…! మీరు ఈ కేటగిరీలో?
Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం
Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం!
భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు!
Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త!
వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు టోకెన్లు! 164 గంటలు - టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటనలు!
పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!

Spotlight

Read More →