- బ్రిటన్ తెలుగు వారిని ఏకం చేసిన వాలీబాల్..
- వాలీబాల్ కోర్టులో 'బెజవాడ బ్లాకర్స్' హవా..
London Volleyball Tournament: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ 14వ వార్షిక వాలీబాల్ టోర్నమెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్లోని స్పోర్ట్స్ డాక్ విజయవంతంగా జరిగింది. బ్రిటన్ అంతటా ఉన్న తెలుగు సమాజ సభ్యులను ఏకం చేస్తూ ఈ టోర్నమెంట్లతో 'టీఏఎల్' 2026 క్రీడా సంవత్సరాన్ని అధికారికంగా ప్రారంభించింది. వార్షిక క్యాలెండర్లో భాగంగా ప్రతిష్టాత్మక ప్రీమియర్ లీగ్ సహా మరిన్ని క్రీడా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జోషి కొమరవల్లి నాయకత్వంలోని "బెజవాడ బ్లాకర్స్" జట్టు టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. అఖిల్ నాయకత్వంలోని "మొబైల్ 365" జట్టు బలమైన పోటీ ఇచ్చి రన్నరప్ గా నిలిచింది. రాకేష్ కామేపల్లి నాయకత్వంలోని "పల్నాడు టైగర్స్” జట్టు మూడవ స్థానాన్ని సాధించింది.
విజేత జట్లను సభ్యులు క్రీడా స్ఫూర్తి, పట్టుదల, నైపుణ్యాన్ని టీఏఎల్ చైర్మన్ రవి సబ్బా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ట్రస్టీలు సత్య పెద్దిరెడ్డి, అశోక్ మాడిశెట్టి, రవి మోచెర్ల, శ్రీదేవి ఎల్లెద్దుల, వెంకట్ నీల, కిరణ్ కప్పెట లకు కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ ఇన్చార్జి సింధూర చెరుకు, అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లకు చైర్మన్ రవి సబ్బా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ రవి సబ్బా క్రీడాకారుల స్ఫూర్తిని ప్రశంసిస్తూ... టీఏఎల్ క్రీడా, సామాజిక కార్యక్రమాలకు అందరి మద్దతు కొనసాగాలని కోరారు. మార్చి 21న నిర్వహించనున్న టీఏఎల్ ఉగాది వేడుకలకు అందరినీ ఆహ్వానించారు.