T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్! FIFA 2026 Ticket Prices: బాబోయ్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్..!! IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్! T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్‌కు భారీ షాక్.. గెలిచినా ఇంటికే, సెమీస్‌కు దూసుకెళ్లిన కివీస్! T20Cricket: రెండు నెలల పాటు నాన్-స్టాప్ వినోదం..! ఐపీఎల్ 2026 పూర్తి వివరాలు ఇవే! Nara Lokesh: భారత్-పాక్ మ్యాచ్‌లో త్రివర్ణ పతాకంతో మెరిసిన ఏపీ మంత్రి! T20 World Cup లో దుమ్మురేపిన భారత్! 176 లక్ష్యంతో పాక్ ఘోర పరాజయం! Cricket Star: బ్యాట్ నుంచి బుక్ వరకు…! 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన వైభవ్! FIFA 2026 Ticket Prices: బాబోయ్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌ టికెట్ల ధరలు చూస్తే గుండె గుభేల్..!! IND vs PAK: ఇండియాతో మ్యాచ్‌కు పాక్ షరతులు.. ICCకి PCB మూడు డిమాండ్లు! ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘనవిజయం.. విశ్వ విజేతగా భారత్!

T20 World Cup 2026: మొన్న బంగ్లాదేశ్.. నేడు పాకిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో ఐసీసీ అనూహ్య మార్పులు..!!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ భాగస్వామ్యంపై నీలినీడలు. పీసీబీ నిర్ణయం ఆలస్యం కావడంతో బంగ్లాదేశ్‌ను స్టాండ్‌బైలో ఉంచిన ఐసీసీ.

Published : 2026-01-27 10:47:00
యువగళం పాదయాత్రకు మూడేళ్లు... టీడీపీ కార్యాలయంలో వేడుకలు!

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 వేదికపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. భారత దేశంలో అడుగుపెట్టేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెనకాడుతుండటంతో, టోర్నీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అప్రమత్తమైంది. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే, వారి స్థానంలో బంగ్లాదేశ్‌ను తిరిగి టోర్నీలోకి తీసుకునేందుకు 'స్టాండ్‌బై'  ఏర్పాట్లు చేస్తుందని సమాచారం. 

మీ మొబైల్ హ్యాక్ అవ్వకూడదు అని అనుకుంటున్నారా... అయితే ఈ సెట్టింగ్స్ మార్చండి!

 పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్ వెళ్లాలా? వద్దా? అనే అంశంపై సోమవారం లాహోర్‌లో హైడ్రామా నడిచింది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో ఆడటంపై ప్రధాని సలహా కోరారు. ఈ భేటీ తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని అంతా ఆశించారు. అయితే, నఖ్వీ తన 'X' (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. తుది నిర్ణయం తీసుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది అని పేర్కొన్నారు. దీంతో పాక్ ఆటగాళ్ల వీసాలు, ప్రయాణ ఏర్పాట్లపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.

Sitting in a chair : రోజంతా కుర్చీలోనేనా.. మీ ఆరోగ్యానికి ఇది రెడ్ అలర్ట్..గంట జిమ్ చేసినా యూజ్ లేదట!

నిజానికి భద్రతా కారణాల సాకుతో భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఐసీసీ గత వారమే టోర్నీ నుండి తప్పించింది. జనవరి 24న బంగ్లాదేశ్ స్థానంలో 'గ్రూప్-సి'లో స్కాట్లాండ్‌ను చేర్చింది. అయితే, ఇప్పుడు పాకిస్థాన్ కూడా ఇదే తరహా మొండివైఖరి ప్రదర్శిస్తుండటంతో.. టోర్నీలో జట్ల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు బంగ్లాదేశ్‌ను మళ్లీ పిలిచే అవకాశం ఉందని సమాచారం. పాక్ గనుక చివరి నిమిషంలో తప్పుకుంటే, ఆ ఖాళీని బంగ్లాదేశ్‌తో భర్తీ చేయాలని ఐసీసీ భావిస్తోంది.

షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మెగా టోర్నీని వేదిక మార్చడం సాధ్యం కాదని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్‌లో టోర్నీ నిర్వహణకు అన్ని దేశాలు అంగీకరించినప్పుడు, కేవలం ఒకటి రెండు దేశాల కోసం నిబంధనలు మార్చలేమని తేల్చి చెప్పింది. ఒకవేళ పాకిస్థాన్ తప్పుకుంటే, అది వారి క్రికెట్ భవిష్యత్తుపై మరియు ఐసీసీ నుండి వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు..

క్రికెట్ మైదానంలో జరగాల్సిన పోరాటం ఇప్పుడు దౌత్యపరమైన చర్చల స్థాయికి చేరింది. పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక పంతానికి పోయి ప్రపంచకప్‌ను వదులుకుంటుందా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఒకవేళ పాక్ తప్పుకుంటే, అది క్రికెట్ అభిమానులకు పెద్ద నిరాశే మిగులుస్తుంది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు.

Spotlight

Read More →