Albanese Wedding Viral: 62 ఏళ్ల వయసులో ప్రేమవివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్!! Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం! రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ... Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన... ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం! Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్! Dithva Cyclone: ఏపీలో దిత్వా ఎఫెక్ట్..! 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం! Albanese Wedding Viral: 62 ఏళ్ల వయసులో ప్రేమవివాహం చేసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్!! Rajya Sabha: పేదల కోసం చర్చలు జరగాలి.. రాజ్యసభలో రాధాకృష్ణన్ సందేశం! రాష్ట్రంలో మొట్ట మొదటి మెడల్ పబ్లిక్ లైబ్రరీ ని మంగళగిరిలో ప్రారంభించిన నారా లోకేష్! భవిష్యత్తులో కూడా ... Double Decker Bus: డబుల్ డెక్కర్ బస్సుల కొత్త రూట్ సిద్ధం! త్వరలో అధికారిక ప్రకటన... ప్రజల్లోకి వెళ్లండి… ప్రభుత్వ మంచిని చెప్పండి! చంద్రబాబు ఆదేశం! Indian stock markets: మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం.. భారీ లాభాలతో ప్రారంభమైన ట్రేడింగ్! Promotions & Social మెయిళ్లతో స్టోరేజ్ నిండిపోతోందా? ఒక్క క్లిక్‌తో క్లియర్! Dithva Cyclone: ఏపీలో దిత్వా ఎఫెక్ట్..! 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు! Greater Vijayawada: రెండు జిల్లాల కలయికతో భారీ అర్బన్ గ్రోత్! భూముల ధరలు రెట్టింపు… Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం!

Pension: ఏపీలో వారికి శుభవార్త! ప్రత్యేక పింఛన్ పథకం త్వరలోనే..!

2025-12-01 10:18:00
Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం...

రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు కళాకారుల కోసం ప్రత్యేకంగా ఒక ముఖ్య నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలనెలా పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులకు, వితంతువులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.15,000, అలాగే కిడ్నీ, తలసీమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10,000 చొప్పున ప్రభుత్వం సహాయం అందిస్తోంది. ఇదే తరహాలో, కళా, సాంస్కృతిక రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, కళాకారుల కోసం ప్రత్యేక పింఛన్ విధానం రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!!

విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్, వస్త్రపురి కాలనీలోని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ కళా సంప్రదాయాలు, సంస్కృతి అనేవి మన సమాజానికి పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ కళారూపాలను పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. కళాకారుల జీవనోపాధి, వారి కృషి, వారసత్వాన్ని కొనసాగడానికి ప్రభుత్వం పునరుత్తేజంతో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలోనే కళాకారులకు ప్రత్యేక పింఛన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు అంగీకార ప్రక్రియలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

Train Tickets: తత్కాల్ టికెట్లకు కొత్త రూల్స్! ఇకపై ఆ వెరిఫికేషన్ తప్పనిసరి..!

కళాకారుల సంక్షేమానికి సంబంధించిన మరిన్ని అంశాలను కూడా మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు. నాటక సమాజాలు, కళా సంఘాలు తప్పనిసరిగా తమ సంస్థలను ప్రభుత్వ వ్యవస్థలో నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ద్వారా కళాకారుల సంఖ్య, వారి పరిస్థితులు వంటి వివరాలు స్పష్టంగా లభిస్తాయని, దీంతో ప్రభుత్వం అందించాల్సిన సాయం, సౌకర్యాలు మరింత వేగంగా అందించగలుగుతుందని తెలిపారు. కళాకారులు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లోకి చురుకుగా ముందుకు రావాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!

తనకు కళారంగంపై ప్రత్యేక అభిరుచి ఉందని చెప్పిన మంత్రి దుర్గేష్, కళాకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)ను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలన్న ప్రతిపాదనను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూత్రప్రాయంగా అంగీకరించారని, ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. కళాకారులకు అవసరమైన అండదండలు, సాయాన్ని అందించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుండేలా కృషి చేస్తుందని మంత్రి దుర్గేష్ మరోసారి స్పష్టం చేశారు.

OPPO Find N6: వరల్డ్ లోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. "ఒప్పో ఫైండ్ N6" లాంఛ్ ఎప్పుడంటే !
BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..!
health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!!
Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో...
Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్!
స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి!

Spotlight

Read More →