Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! Bharath Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్... ఎందుకు? ఏమిటి? Amaravati: అమరావతే శాశ్వత రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ విమర్శలు! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం.. Group1Scam: ఏపీ గ్రూప్-1 అక్రమాలపై సిట్ విచారణకు హైకోర్టు సంచలన తీర్పు! AP Cabinet Meeting Decisions: సౌర విద్యుత్, బయోగ్యాస్ ప్లాంట్లకు భూ కేటాయింపు.. ఆ ప్రాంతంలో 1500 ఎకరాలు కేటాయింపు.!! AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.! AP Assembly Satirical Comments : 11వ తేదీ.. 11 మంది.. 11 నిమిషాలు వైకాపా తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు! AP Budget 2026 ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.. ఏం చెప్పామన్నదే ముఖ్యం.. అసెంబ్లీలో కొత్త సంప్రదాయానికి పయ్యావుల పిలుపు..!! AP Ministers: ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు! కుటుంబ సభ్యుల్లో ఆందోళన... AP Budget 2026 Date: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ షెడ్యూల్ ఖరారు.. మార్చి 7 వరకు సమావేశాలు 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం..!! Bharath Bandh: దేశవ్యాప్తంగా భారత్ బంద్... ఎందుకు? ఏమిటి? Amaravati: అమరావతే శాశ్వత రాజధాని.. మూడు రాజధానుల ప్రతిపాదనపై గవర్నర్ విమర్శలు! AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం..

AP Assembly Budget Session Strategy: కుల, మత చిచ్చు పెట్టాలని వైకాపా ప్లాన్.. ఎన్డీఏ భేటీలో చంద్రబాబు పవన్ కీలక వ్యాఖ్యలు.!

AP Assembly Budget Session Strategy: ఎన్డీఏ భేటీలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధీమా. ఎమ్మెల్యేలు ఉదయం 9 గంటలకే అసెంబ్లీకి రావాలని, వ్యక్తిగత కక్షల కోసం సభను వాడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరిక.

Published : 2026-02-11 17:24:00
  • Amaravati Meeting: అమరావతిలో ఎన్డీఏ శాసనసభాపక్ష భేటీ: కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు, పవన్ దిశానిర్దేశం!
  • పవన్ కల్యాణ్ హెచ్చరిక.. 15 ఏళ్ల కూటమి.. అప్రమత్తంగా ఉండండి!

అమరావతి (Amaravati) వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన ఈ భేటీకి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  హాజరయ్యారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతిపక్ష వైకాపా ఎత్తుగడలను తిప్పికొట్టే విధానంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

కూటమి నాయకత్వం మధ్య ఉన్న సమన్వయం, భవిష్యత్తు కార్యాచరణపై సభ్యులకు ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ వైకాపా తీరుపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ మతాన్ని రాజకీయంగా వాడుకుంటూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. వైకాపా చేసే ఇటువంటి విధ్వంసక ప్రయత్నాల పట్ల కూటమిలోని మూడు పార్టీల సభ్యులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

కూటమి సుస్థిరతపై పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేస్తూ రాబోయే 15 ఏళ్ల పాటు ఈ కూటమి ప్రయాణం ఇలాగే  కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమికి విఘాతం కలిగించేలా ఏ సభ్యుడూ బహిరంగంగా మాట్లాడవద్దని, క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. అసెంబ్లీకి వచ్చి కేవలం అరుపులు, కేకలతో కాలక్షేపం చేస్తున్న వైకాపా నేతల వల్ల ఎవరికీ ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు ఎలా ఉండేవో, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని, తప్పుడు ప్రచారాలను సభ్యులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ముగింపు ఉపన్యాసంలో సభ్యులకు కఠినమైన నిబంధనలను విధించారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, క్షేత్రస్థాయిలో జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ నాయకులు ఐక్యంగా ఉండాలని స్పష్టం చేశారు. ఐక్యంగా ఉంటేనే కూటమి ప్రయాణం సాఫీగా సాగుతుందని, ఎమ్మెల్యేల పనితీరును తాను వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా పరిశీలిస్తానని హెచ్చరించారు. వ్యక్తిగత కక్షల కోసం సభను వేదికగా చేసుకోవద్దని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సభలో ఎవరూ ఇష్టానుసారం నోరు జారొద్దని, సభ్యుల ప్రసంగాలను తాను నిశితంగా గమనిస్తానని సీఎం పేర్కొన్నారు.

ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే అందరూ అసెంబ్లీకి హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉదయం నుండే తాను అసెంబ్లీలో ఉండి సభా వ్యవహారాలను పర్యవేక్షిస్తానని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని గుర్తు చేశారు. వైకాపా కుతంత్రాలను ఎండగడుతూనే, మరోవైపు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సభలో చర్చలు సాగాలని చంద్రబాబు నాయుడు శాసనసభాపక్ష సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

Spotlight

Read More →