LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Visakhapatnam: విశాఖలో మానవ అక్రమ రవాణాపై వర్క్‌షాప్! న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరిగిందన్న హోంమంత్రి అనిత!

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా మరియు బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం, 1976 పై ఒకరోజు వర్క్‌షాప్ విశాఖపట్నంలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Visakhapatnam: విశాఖలో మానవ అక్రమ రవాణాపై వర్క్‌షాప్! న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరిగిందన్న హోంమంత్రి అనిత!

ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోం మంత్రి అనిత.. 

పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్.. 

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్ విభాగం ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా మరియు బానిస కార్మిక వ్యవస్థ (రద్దు) చట్టం, 1976 పై ఒకరోజు వర్క్‌షాప్ విశాఖపట్నంలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ప్రాసిక్యూషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వర్క్‌షాప్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ రామ కోటేశ్వర రావు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడేలా ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌కు అభినందనలు తెలిపారు. ప్రజల్లో చట్టాలు, న్యాయవ్యవస్థపై నమ్మకం పెరుగుతోందని చెప్పారు. “పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక గౌరవప్రదమైన బాధ్యత” అని ఆమె అన్నారు.

పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ రాకుండానే శిక్షలు పడుతున్నాయని ఆమె వివరించారు. పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సమయానుకూల న్యాయం అందుతుందని స్పష్టం చేశారు.

అదేవిధంగా, ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ ట్రేస్” ద్వారా ఇప్పటివరకు 900 మంది పిల్లలను రక్షించామని వెల్లడించారు. విదేశాల్లో చిక్కుకున్న 180 మంది భారతీయులను కూడా సురక్షితంగా తిరిగి తీసుకువచ్చినట్లు తెలిపారు.

పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నామని, పోలీసు-న్యాయ వ్యవస్థలు పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని హోంమంత్రి పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపులో వివిధ కేసుల్లో విశేష ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను హోంమంత్రి అనిత సత్కరించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా పనిచేసే దిశగా అధికారులకు అవగాహన పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…