AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? Chandrababu: మీ భూమిపై మీకే హక్కు.. సూరేపల్లి వేదికగా సీఎం చంద్రబాబు భరోసా! Chandrababu: పోలవరం, అమరావతిని పునర్నిర్మించే అదృష్టం నాదే.. రూ. 1,000 కోట్లు వదులుకున్నాం.. సీఎం కీలక వ్యాఖ్యలు.! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! Prajavedhika: రికార్డుల నుంచి 19 సెంట్లు మాయం.. రీ-సర్వేలో రైతుకు జరిగిన ఆ అన్యాయం! సామాన్యుడి ఆర్తనాదం ఎందుకు వినిపించడం లేదు? Chandrababu: మీ భూమిపై మీకే హక్కు.. సూరేపల్లి వేదికగా సీఎం చంద్రబాబు భరోసా! Chandrababu: పోలవరం, అమరావతిని పునర్నిర్మించే అదృష్టం నాదే.. రూ. 1,000 కోట్లు వదులుకున్నాం.. సీఎం కీలక వ్యాఖ్యలు.!

Andhra Pradesh News: తెలుగుకు తిరిగి గౌరవం రావాలంటూ.. ఆ పని చేయాల్సిందే అంటున్న వెంకయ్య నాయుడు!!

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ‘కృష్ణా తరంగ్ 2025’ ఉత్సవాల్లో పాల్గొన్న భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు భాష ప్రాధాన్యతపై తనదైన స్పష్టమైన అభిప్

Published : 2025-12-04 16:10:00
Bangalore: బెంగళూరు సొసైటీ సంచలనం! బ్యాచిలర్స్ వారు రాగానే భారీ జరిమానా!

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ‘కృష్ణా తరంగ్ 2025’ ఉత్సవాల్లో పాల్గొన్న భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు భాష ప్రాధాన్యతపై తనదైన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినని‌ అనుకోకుండా హిందీ వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్న రోజులను గుర్తుచేసుకున్నారు. తన వ్యక్తిగత ప్రయాణమే మాతృభాష మనిషిని ఎంత దూరం తీసుకెళ్లగలదో ఒక ఉదాహరణ అని అన్నారు.

Yoga Asanas: చలికాలంలో జీర్ణక్రియ సమస్యలు అధికమవుతున్నాయా? ఈ 6 యోగా ఆసనాలు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు!!

ఈ వేడుకల్లో మాట్లాడిన వెంకయ్య నాయుడు, తెలుగు నేర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందని చెప్పినట్లయితేనే ప్రజలు తమ భాషకు విలువ ఇస్తారని వ్యాఖ్యానించారు. భాషను కేవలం ఇంటి వరకే పరిమితం చేయకుండా, ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలన, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో తెలుగు తప్పనిసరి కావాలని సూచించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్.. చైతూ-శోభితల మొదటి పెళ్లిరోజు..!

బ్రిటిష్ రాజ్ కాలంలో ఇంగ్లీష్ వాళ్లు తమ భాషను అధికార భాషగా చేసుకుని పాలన నడిపినట్లే, తెలుగు మాట్లాడే ప్రజలు తమ భాషను పరిపాలన భాషగా నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని నాయుడు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భారతీయ భాషలకు ప్రాధాన్యత పెంచాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మెడికల్, ఇంజనీరింగ్ వంటి ప్రావిణ్య రంగాల్లో మాతృభాషలోనే బోధన అందేలా మార్పులు జరుగుతున్నాయని వివరించారు.

వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ శాఖ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ లు.. చలాన్లపై డిస్కౌంట్.!

తెలుగు మాట్లాడటం రాకపోతే ఉద్యోగాలకు అర్హత లేకపోయేలా కాకుండా, మాతృభాషపై ప్రేమ పెరగడానికి ప్రభుత్వాలు ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. “మనకు ఇంగ్లీష్ రాకపోయినా పేపర్ మీద రాసుకుని మాట్లాడవచ్చు, కానీ మన భాషలో మాట్లాడితే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది” అని నాయుడు అన్నారు.

Rashmika : ఫిబ్రవరిలో పెళ్లి ప్రచారంపై రష్మిక స్పందన.. నాకు సమయం వచ్చినప్పుడు!

తెలుగు భాష పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అన్న భావన పెంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ముందుగా మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించి, ఆ తరువాత ఇతర భాషలు నేర్చుకోవడం మంచిదని చెప్పారు. భాష పట్ల అలాంటి ఆత్మగౌరవం ఉంటేనే మన సంస్కృతి, మనుగడ మరింత బలపడుతుందని నాయుడు స్పష్టం చేశారు.

బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా..

తాను ఉప రాష్ట్రపతిగా ఉన్న సమయంలో, రాజ్యసభలో ఏ భాషలోనైనా సభ్యులు మాట్లాడేందుకు అనుమతి ఇచ్చే విధంగా నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చామని గుర్తుచేశారు. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయనీ, ప్రతి భాషకు ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి, చైతన్యం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Akhanda-2 : అఖండ-2 రిలీజ్‌కి స్టే.. మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!

వెంకయ్య నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో కొనసాగుతున్న భాషా చర్చలకు కొత్త ఊపునిచ్చాయి. మాతృభాషను విద్యలోనే కాదు, పరిపాలనలో కూడా ప్రాధాన్యంగా ఉంచాలన్న ఆయన సూచనలు విద్యా ప్రముఖులు, భాషా నిపుణుల నుంచి ప్రశంసలు పొందుతున్నాయి. తెలుగు మీడియం మరోసారి గుర్తింపు వచ్చే వాతావరణం ఏర్పడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RRB: డిప్లొమా, BSc అర్హతలు ఉన్నవారికి అవకాశాలు.. 18-33 ఏళ్ల మధ్య దరఖాస్తు చేసుకోండి!

తెలుగు భాషకు గౌరవం, ప్రభుత్వ విధానాల్లో ప్రాధాన్యం, భవిష్యత్ తరాలకు మాతృభాష విలువ నేర్పడం ఇవి మూడు లక్ష్యాలు అమలు అయితేనే భాష నిజమైన అభివృద్ధి సాధిస్తుందని వెంకయ్య నాయుడు తన ప్రసంగంలో సూచించారు.

ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?
Cyber Crime: సైబర్ క్రిమినల్‌కు రివర్స్ స్ట్రోక్! చాట్‌జీపీటీతో ట్రాప్ వేసిన ఢిల్లీ యువకుడు!

Spotlight

Read More →