LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Israel Iran War 2026: బాంబులు.. క్షిపణులు.. వేల కోట్లు! ఇరాన్ దాడులతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం.!!

Israel Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధం అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధం మొదలైన ఆరు రోజుల్లోనే అమెరికా ప్రభుత్వం సుమారు రూ. 94,500 కోట్లు ఖర్చు చేసిందని సమాచారం..

AndhraPravasi News Desk 2 min read
Israel Iran War 2026: బాంబులు.. క్షిపణులు.. వేల కోట్లు! ఇరాన్ దాడులతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం.!!

Israel Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ యుద్ధం ఊహించని రీతిలో భారంగా మారుతోంది. యుద్ధం మొదలై వారం కూడా గడవకముందే అమెరికా ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేసింది.  అంతర్జాతీయ సమాచారం ప్రకారం, కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు 11.3 బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 94,500 కోట్లు ఖర్చయ్యాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఈ దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో ప్రజల సొమ్ము ఖర్చు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా యుద్ధం మొదలైన మొదటి రెండు రోజుల్లోనే అమెరికా సైన్యం ప్రయోగించిన బాంబులు, క్షిపణుల విలువే దాదాపు రూ. 51,400 కోట్లుగా ఉంది. ఇవి కేవలం ఆయుధాల కోసం చేసిన ఖర్చులు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో ఇతర సైనిక అవసరాలను లెక్కలోకి తీసుకుంటే ఈ అంకె ఐదు రెట్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైట్‌హౌస్ అధికారులు సెనేటర్లతో జరిపిన అంతర్గత సమావేశంలో ఈ లెక్కలను బయటపెట్టినట్లు తెలుస్తోంది. యుద్ధం కొనసాగే కొద్దీ ఈ ఆర్థిక భారం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధం కోసం అదనపు నిధుల వేటలో పడ్డారు. యుద్ధం కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా లెబనాన్ వరకు విస్తరించడం, ప్రపంచ దేశాల్లో ఇంధన ధరలు పెరగడం వంటివి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. దీనిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నుంచి మరో 50 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ కోరాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇప్పటికే దేశ రక్షణ నిల్వలు తగ్గిపోతున్నాయని, ఆయుధాల సరఫరా కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా లేదని ప్రతిపక్ష డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధం వల్ల ఆర్థిక నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా భారీగా జరుగుతోంది. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ట్రంప్ తన పర్యటనల్లో "మేము యుద్ధం గెలిచాం, కానీ పని పూర్తయ్యే వరకు అక్కడే ఉంటాం" అని గంభీరంగా ప్రకటిస్తున్నప్పటికీ, ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. యుద్ధం తర్వాత ఇరాన్ పరిస్థితి ఏంటి? అసలు ఈ దాడుల వల్ల అమెరికా సాధించేది ఏంటి? అనే ప్రశ్నలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులతో ట్రంప్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం చూస్తుంటే, యుద్ధ తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఇరాన్‌పై పట్టు కోసం జరుగుతున్న పోరాటమా లేక ప్రపంచ రాజకీయాల్లో మార్పుల కోసమా అన్నది పక్కన పెడితే, సాధారణ అమెరికా పౌరుల పన్నుల డబ్బు మాత్రం యుద్ధ జ్వాలల్లో కాలిపోతోంది. మున్ముందు ఈ ఖర్చు లక్షల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…