AP Govt: కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. నేతన్నలకు వెలుగుల పండుగ! గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు.. Manickam Tagore: అమరావతిని అడ్డుకోం.. అండగా ఉంటాం! లోక్‌సభలో రాజధాని చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు.. Amaravati Capital: పార్లమెంటులో ఏపీ విభజన చట్టంపై వాడివేడి చర్చ... అమరావతికి పెరిగిన మద్దతు! CM Ramesh: జగన్‌పై సీ.ఎం. రమేష్ నిప్పులు.. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రా రాజధానిపై చర్చ.! అమరావతి బిల్లుపై.. Minister Pemmasani: లోక్‌సభలో అమరావతి గర్జన.. తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్న మంత్రి! 1631 రోజుల పోరాటం.. Ram Mohan: ఆ స్కూళ్లకు మహర్దశ.. మంత్రి రామ్మోహన్ చొరవతో రూ. 30 లక్షల నిధులు మంజూరు.! Polavaram: పోలవరానికి కేంద్ర నిధుల వెల్లువ... దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం! Steel Bridge: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీ మార్పులు! 70 కోట్లు.. 88 గడ్డర్లు.. మరో 15 రోజులు మాత్రమే! Chandrababu: "ఏపీ పల్లెల్లో జాతీయ వెలుగులు".. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులపై సీఎం హర్షం.! Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.! AP Govt: కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. నేతన్నలకు వెలుగుల పండుగ! గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు.. Manickam Tagore: అమరావతిని అడ్డుకోం.. అండగా ఉంటాం! లోక్‌సభలో రాజధాని చట్టబద్ధత బిల్లుకు సంపూర్ణ మద్దతు.. Amaravati Capital: పార్లమెంటులో ఏపీ విభజన చట్టంపై వాడివేడి చర్చ... అమరావతికి పెరిగిన మద్దతు! CM Ramesh: జగన్‌పై సీ.ఎం. రమేష్ నిప్పులు.. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రా రాజధానిపై చర్చ.! అమరావతి బిల్లుపై.. Minister Pemmasani: లోక్‌సభలో అమరావతి గర్జన.. తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్న మంత్రి! 1631 రోజుల పోరాటం.. Ram Mohan: ఆ స్కూళ్లకు మహర్దశ.. మంత్రి రామ్మోహన్ చొరవతో రూ. 30 లక్షల నిధులు మంజూరు.! Polavaram: పోలవరానికి కేంద్ర నిధుల వెల్లువ... దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం! Steel Bridge: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భారీ మార్పులు! 70 కోట్లు.. 88 గడ్డర్లు.. మరో 15 రోజులు మాత్రమే! Chandrababu: "ఏపీ పల్లెల్లో జాతీయ వెలుగులు".. పంచాయతీరాజ్ శాఖకు 5 జాతీయ అవార్డులపై సీఎం హర్షం.! Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.!

Minister Pemmasani: లోక్‌సభలో అమరావతి గర్జన.. తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్న మంత్రి! 1631 రోజుల పోరాటం..

Minister Pemmasani: లోక్‌సభ వేదికగా అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు. అమరావతిపై తనకున్న మక్కువను చాటుకుంటూ ఆయన పూర్తిగా తెలుగులోనే ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.

Published : 2026-04-01 13:15:00
  • "34 వేల ఎకరాలిచ్చిన రైతులకు వందనం": రాజధాని రైతుల త్యాగాలను కొనియాడిన మంత్రి..
     
  • Politics: "రైతుల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది": గత ప్రభుత్వ చిత్రహింసలను ఎండగట్టిన కేంద్రమంత్రి..

Minister Pemmasani: లోక్‌సభ వేదికగా అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత భావోద్వేగంతో ప్రసంగించారు. అమరావతిపై తనకున్న మక్కువను చాటుకుంటూ ఆయన పూర్తిగా తెలుగులోనే ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి అనేది తనకు కేవలం ఒక ప్రాంతం కాదని, ఒక ఎమోషన్ అని పేర్కొన్న ఆయన, ఆ రాజధాని బిడ్డగా ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా అందించిన రైతాంగానికి, వందలాది రోజులుగా శాంతియుతంగా పోరాటం చేసిన అమరావతి ఉద్యమకారులకు ఆయన తన ప్రసంగం ద్వారా శిరస్సు వంచి నమస్కరించారు. అమరావతి సంస్కృతి, శాంతి మరియు విజ్ఞానానికి యుగయుగాల నిలయమని, ఆంధ్రుల కలల రాజధానిగా దీనిని తీర్చిదిద్దడం చారిత్రక అవసరమని స్పష్టం చేశారు.

గత ఐదేళ్ల కాలంలో అమరావతి రైతులు అనుభవించిన కష్టాలను మంత్రి పెమ్మసాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు రాజధానికి మద్దతిచ్చిన జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల కాలయాపన చేశారని విమర్శించారు. భూములిచ్చిన 29 వేల మంది రైతులను 'పెయిడ్ ఆర్టిస్టులు' అంటూ అవమానించారని, మహిళలను మరియు వృద్ధులను సైతం లెక్కచేయకుండా 1631 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు సాగిన పాదయాత్రల్లో మేకులున్న లారీలను అడ్డుపెట్టి రైతులను వేధించారని, ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని దుస్థితిని గత ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. రాజధాని మహిళా రైతుల కన్నీళ్లే నేడు ఈ చట్టానికి బలమైన పునాదిగా మారాయని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న అచంచలమైన నమ్మకంతోనే రైతులు రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారని మంత్రి కొనియాడారు. ప్రస్తుతం అమరావతిలో అత్యంత ఆధునిక మౌలిక వసతులతో ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, రాజధాని నిర్మాణమే చంద్రబాబు ప్రధాన ఆశయమని వెల్లడించారు. తన గళం మరియు స్ఫూర్తితో కూటమి ఐక్యతకు పవన్ కళ్యాణ్ బాటలు వేశారని, బీజేపీ, టీడీపీ మరియు జనసేన కలయిక తెలుగువారి భవిష్యత్తుకు భరోసానిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేస్తూ, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా లోక్‌సభలో ఉద్ఘాటించారు.

Spotlight

Read More →