Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Chandrababu: సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో చంద్రబాబు.. 5 పిల్లర్లతో పటిష్టంగా - ఏడాదిలో 56.40 లక్షల మందికి.!

Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా..

Minister Gottipati: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) మరియు నెడ్ క్యాప్ (NEDCAP) ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ భేటీ జరిగింది.

Published : 2026-03-31 16:29:00
  • Politics: లో-వోల్టేజ్ సమస్యలకు చెక్: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి సమీక్ష..
     
  • పీఎం కుసుమ్ పనుల వేగవంతం: భూ కేటాయింపులపై కలెక్టర్లతో సమన్వయానికి మంత్రి సూచన..

Minister Gottipati: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో ఏపీసీపీడీసీఎల్ (APCPDCL) మరియు నెడ్ క్యాప్ (NEDCAP) ఉన్నతాధికారులతో కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ప్రధానంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఆర్డీఎస్ఎస్ (RDSS), వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పీఎం సూర్యఘర్ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తున్నామని, ఈ పథకం కింద మంజూరు చేసిన 6 లక్షల కనెక్షన్ల పనులను అధికారులందరూ సమన్వయంతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.

సౌర విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటులో నాణ్యతకు పెద్దపీట వేయాలని మంత్రి సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని 'మోడల్ సోలార్ విలేజ్' (Model Solar Village) గా తీర్చిదిద్దాలని, తద్వారా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి తోడు పీఎం కుసుమ్ (PM-KUSUM) పథకం పనులను వేగవంతం చేయాలని, భూ కేటాయింపుల విషయంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీపీడీసీఎల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల పరిరక్షణపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో తరచూ జరుగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లో-వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని సూచించగా, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు. వినియోగదారుల సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి సంతృప్తి స్థాయిని 90 శాతానికి పెంచడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను కోరారు. ఆర్డీఎస్ఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →