Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.!

Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.!

Ramanarayana Reddy: నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి మరియు దేవాలయాల పునర్నిర్మాణ పనులపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

Published : 2026-03-31 18:00:00
  • Politics: "శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత": పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం..
     
  • నెల్లూరు క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి భేటీ: హాజరైన ఆర్జేసీ ఆజాద్ మరియు ఆలయ ఈఓలు..

Ramanarayana Reddy: నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి మరియు దేవాలయాల పునర్నిర్మాణ పనులపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లావ్యాప్తంగా సాగుతున్న ఆలయాల అభివృద్ధి పనులు, పునర్నిర్మాణ ప్రక్రియలు మరియు శ్రీవాణి ట్రస్టు ద్వారా చేపట్టిన నూతన ఆలయాల నిర్మాణాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని ప్రధాన క్షేత్రాల్లో ప్రస్తుతం కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న ఆయన, ఎక్కడా జాప్యం జరగకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

జిల్లాలోని ప్రతి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఉండాలని, మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి రాజీ పడకూడదని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయాల పునర్నిర్మాణ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, నూతన ఆలయాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుంటూ, ప్రతిపాదిత ఆలయ పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన సూచించారు.

సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఆజాద్, నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కోవూరు జనార్దన్‌రెడ్డితో పాటు జిల్లాలోని వివిధ ప్రముఖ ఆలయాల కార్యనిర్వాహణ అధికారులు (EOs) పాల్గొన్నారు. అధికారులు తమ పరిధిలోని ఆలయాల్లో జరుగుతున్న పనుల ప్రస్తుత స్థితిగతులను మంత్రికి నివేదించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం, తాగునీరు మరియు క్యూలైన్ల నిర్వహణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆలయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను కోరారు.

Spotlight

Read More →