Minister Comments On YCP: అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టిన వైసీపీ నీతులు చెప్పడం సిగ్గుచేటు - మంత్రి! AP Investments: 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు... 1.22 లక్షల ఉద్యోగాల లక్ష్యం! New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..! త్వరలో దరఖాస్తులు ప్రారంభం! Service Road: ఏపీలో వారికి పండగే పండగ! ఆ నది పై వంతెన, సర్వీస్ రోడ్డు కు గ్రీన్ సిగ్నల్! AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్! Minister Comments On YCP: అన్న క్యాంటీన్లు మూసేసి పేదల పొట్ట కొట్టిన వైసీపీ నీతులు చెప్పడం సిగ్గుచేటు - మంత్రి! AP Investments: 18 నెలల్లో రూ.20,088 కోట్ల పెట్టుబడులు... 1.22 లక్షల ఉద్యోగాల లక్ష్యం! New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్..! త్వరలో దరఖాస్తులు ప్రారంభం! Service Road: ఏపీలో వారికి పండగే పండగ! ఆ నది పై వంతెన, సర్వీస్ రోడ్డు కు గ్రీన్ సిగ్నల్! AIFB: కవితకు వడ్డేపల్లి ట్విస్ట్... గెలిచిన తర్వాత ఏఐఎఫ్బీ నేతల సంచలన ప్రకటన! Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం! Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం! Irrigation Projects 2026: సీమకు జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు! New Pensions: పెన్షన్ దారులకు గుడ్ న్యూస్! కొత్త పెన్షన్ల దరఖాస్తులకు రంగం సిద్ధం! Fee Reimbursement: రమ్మంటే పారిపోతారా? వైసీపీ వాకౌట్‌పై మంత్రి లోకేష్ ఫైర్!

KTR statement Municipal elections: మున్సిపల్ పోరులో ముదిరిన సెగ.. కౌంటింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ!

Telangana Municipal Election Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పరిగి, బెల్లంపల్లి కౌంటింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. 750 వార్డుల్లో విజయం సాధించామని కేటీఆర్ ప్రకటించగా, కాంగ్రెస్ దౌర్జన్యాలతో గెలిచిందని బీజేపీ ఆరోపిస్తోంది...

Published : 2026-02-13 19:30:00
  • సాధారణ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లోనే.!
     
  • 750 వార్డుల్లో విజయం - ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా ధైర్యంగా..

Telangana Municipal Election Results: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా వికారాబాద్‌లోని పరిగి కౌంటింగ్ కేంద్రం దగ్గర సీన్ చూస్తే అది స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ మూడో వార్డులో హనుమంతు అనే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడంతో అసలు రగడ మొదలైంది. ఆ గెలిచిన అభ్యర్థిని తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించడం, దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో రెండు పార్టీల మధ్య పెద్ద ఘర్షణే జరిగింది. ఒక స్వతంత్ర అభ్యర్థి కోసం రెండు ప్రధాన పార్టీలు నడిరోడ్డుపై ఇలా గొడవ పడటం చూస్తుంటే, మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ఎంతటి పోటీ ఉందో ఈ సంఘటనతో  అర్థమయిపోతుంది.

ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గర పరిస్థితి అయితే ఇంకాస్త సీరియస్‌గా ఉంది. అక్కడ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎమ్మెల్యే వినోద్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసులు మాజీ ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఆధిపత్య పోరు వల్ల కౌంటింగ్ కేంద్రం కాస్తా యుద్ధ భూమిని తలపించింది.

సాధారణ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లోనే స్థానిక నేతల మధ్య పంతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. పోలీసులు, దౌర్జన్యాలతోనే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచిందని, వాళ్లకు క్లియర్ మెజారిటీ ఎక్కడా రాలేదని ఆయన ఆరోపించారు. చాలా చోట్ల హంగ్ రావడంతో తాము స్వతంత్రుల మద్దతుతో చైర్మన్ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా ధైర్యంగా పోరాడారని, సుమారు 750 వార్డుల్లో విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. వర్ధన్నపేట, వికారాబాద్ లాంటి చోట్ల తమ కౌన్సిలర్లను అధికార పార్టీ నేతలు ఎత్తుకెళ్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు లోపల కలిసి పనిచేసినా, ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపే ఉన్నారని  చెప్పుకొచ్చారు. ఇదే జోష్‌తో రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని కేటీఆర్   ధీమా వ్యక్తపరిచారు.
 
ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు  రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఒక పక్క అధికార దుర్వినియోగం జరిగిందని విపక్షాలు అంటుంటే, ప్రజలు తమకే పట్టం కట్టారని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతిస్తామని కేటీఆర్ ప్రకటించడం చూస్తుంటే ఇతర లౌకిక పార్టీలను కలుపుకుని వెళ్లాలని బీఆర్ఎస్  భావిస్తుందని అర్థమైపోతుంది. ఏదేమైనా గెలిచిన కౌన్సిలర్లను కాపాడుకోవడం ఇప్పుడు పార్టీలకు పెద్ద సవాలుగా మారింది. క్యాంపు రాజకీయాలు, రిసార్ట్ పాలిటిక్స్  ముందు ముందు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.

Spotlight

Read More →