AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! AP Police: రాజకీయ, మతపరమైన చిచ్చు పెట్టేవారిపై నిఘా.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్.! Pawan Kalyan: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ స్కెచ్! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!

Krishna District Jagananna Colonies: ప్రకృతిని తుడిచిపెట్టారు.. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు.. బయటపడ్డ 'మడ' కుంభకోణం!

Jagananna Colonies Scam: కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన భారీ భూ కుంభకోణం బయటపడింది. మాజీ మంత్రి జోగి రమేశ్ అనుచరులు మడ అడవులను నరికేసి, మెరక పనుల పేరుతో ఉపాధి హామీ గృహ నిర్మాణ శాఖ నిధులను ఎలా మళ్లించారో తెలుసుకోండి.

Published : 2026-02-13 16:42:00

ఇళ్ల స్థలాల పేరిట భారీ దోపిడీ…

 కృత్తివెన్నులో బయటపడ్డ వైసీపీ నేతల అక్రమాలు…

తీర ప్రాంత రక్షణ కవచానికే తూట్లు…

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా నిధులు దారి మళ్లాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా పర్యావరణానికి ఎంతో మేలు చేసే మడ అడవులను నాశనం చేసి, ఆ భూమిని ఇళ్ల స్థలాల కోసం వాడటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను సుమారు ఏడు ఎకరాల వరకు జెసిబిలతో తొలగించేశారు. పర్యావరణ చట్టాల ప్రకారం ఇలాంటి చోట్ల ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. కానీ, అధికార బలం ఉపయోగించి అడవిని కొట్టేసి, ఆ స్థలాన్ని ఇళ్ల పట్టాల కోసం సిద్ధం చేశారు. ఇది ప్రకృతికి విఘాతం కలిగించడమే కాకుండా, భవిష్యత్తులో తీర ప్రాంతానికి ముప్పు తెచ్చేలా ఉందని తెలిపారు.

నిజానికి ఆ ప్రాంతం ఇళ్లు కట్టుకోవడానికి అస్సలు పనికిరాదు. అది పూర్తిగా పల్లపు ప్రాంతం కావడంతో, దాన్ని పూడ్చడానికి  ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకం నుండి రూ. 16.64 లక్షలు, గృహ నిర్మాణ శాఖ నుండి మరో రూ. 16.24 లక్షలు ఇలా మొత్తం నిధులను మట్టి పనుల పేరుతో డ్రా చేశారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అరకొర పనులు మాత్రమే జరిగాయి.

కేవలం నాలుగు ఎకరాల్లోనే కాస్త మట్టి పోసి వదిలేశారు. మిగిలిన డబ్బులన్నీ నేతలు, కొందరు అధికారులు పంచుకున్నారని విమర్శలు వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు ఆ ప్రాంతమంతా చెరువులా మారిపోతోంది. మోకాలోతు నీళ్లు నిలుస్తున్న చోట పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పేదల కంటే నేతల జేబులు నింపుకోవడానికే ఈ పథకాన్ని వాడుకున్నట్లు కనిపిస్తోంది.

అక్రమాలకు సంబంధించిన రికార్డులను కూడా మాయం చేశారని  అధికారులను భయపెట్టి ఫైళ్లను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణాన్ని పాడు చేసి, ప్రభుత్వ సొమ్మును కాజేసిన ఈ వ్యవహారంపై కొత్త ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Spotlight

Read More →