Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! Statue Of Sacrifice: రాజధానిలో సరికొత్త రికార్డు! 6 నెలల్లో 58 అడుగుల కాంస్య విగ్రహం... ఆవిష్కరణకు సర్వం సిద్ధం! Praja Vedika: నేడు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Smart Family Cards: ఏపీలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ... ఎప్పటినుండంటే! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే!

Chandrababu Naidu: శ్రీకాకుళం–విజయనగరం–విశాఖకు మెగా ప్రాజెక్ట్..! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

Chandrababu Naidu: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి(APDevelopment) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు జిల్లాలను కలుపుతూ భారీ ప్రాజెక్ట్ (Mega Project) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రణాళిక ద్వారా పారిశ్రామిక రంగం బలోపేతం కావడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

Published : 2026-02-13 15:53:00

పల్నాడులో మెగా టెక్స్‌టైల్ పార్క్, తిరుపతిలో స్పోర్ట్స్ హబ్…

అమరావతికి సెమీకండక్టర్ హబ్ ప్లాన్…

రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక గొప్ప శుభవార్తను అందించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ కేటాయింపులపై ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా, కేంద్రం ప్రతిపాదించిన 'రేర్ ఎర్త్ కారిడార్'ను ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలను కలుపుతూ ఈ భారీ ప్రాజెక్టును తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త దిశను చూపుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా అమరావతిని సాంకేతిక హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. 'ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0'లో భాగంగా అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అలాగే రాజధాని ప్రాంతంలోని హెల్త్ సిటీలో బయోడిజైన్, మెడ్ టెక్ పార్క్ వంటి అత్యాధునిక సౌకర్యాలను తీసుకురావాలని నిర్ణయించారు. 'హీల్ ఇన్ ఏపీ' అనే విధానం ద్వారా అమరావతిని మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.

పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు తీర ప్రాంతం వెంబడి ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను మరింత విస్తరించాలని చంద్రబాబు సూచించారు. మూలపేట నుంచి కృష్ణపట్నం వరకు ఈ కారిడార్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. వీటితో పాటు కంటైనర్ మరియు ఎక్విప్మెంట్ తయారీ రంగాల్లో కూడా కొత్త ప్రాజెక్టులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు ప్రాంతంలో మెగా టెక్స్‌టైల్ పార్కును, తిరుపతిలో స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని హిందుపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సీఎం నిర్ణయించారు. తిరుపతిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, మరిన్ని బస్సులు సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా రవాణాను మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు.

వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. కొబ్బరి, కోకో, జీడిమామిడి, కాఫీ వంటి పంటలకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు సాధించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాలతో రాష్ట్ర ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ, అదనపు నిధులు రాబట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
 

Spotlight

Read More →