LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Juvvaladinne Fishing Harbor: జువ్వలదిన్నె హార్బర్ అడ్డంకులకు జగన్ రెడ్డే కారణం.. సోమిరెడ్డి ఫైర్..!

Juvvaladinne Fishing Harbor: జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టుల నిర్మాణానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇచ్చిన జీఓలే అడ్డంకిగా మారాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే నిధులు సాధించామని, మూడు నెలల్లో హార్బర్ పనులు పూర్తి చేసి మత్స్య…

AndhraPravasi News Desk 2 min read
Juvvaladinne Fishing Harbor: జువ్వలదిన్నె హార్బర్ అడ్డంకులకు జగన్ రెడ్డే కారణం.. సోమిరెడ్డి ఫైర్..!

Juvvaladinne Fishing Harbor: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశం  ఇప్పుడు  వేడి పుట్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత్స్యకారుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదని ఆయన విమర్శించారు. 

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కుమారుడి ఆర్థిక ప్రయోజనాల కోసం తీర ప్రాంతాభివృద్ధిని అడ్డుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. 2008లో జారీ చేసిన జీఓ నంబర్ 40 ద్వారా కృష్ణపట్నం పోర్టు నుంచి వాడరేవు వరకు ఎటువంటి కొత్త పోర్టులు లేదా హార్బర్లు నిర్మించకూడదని ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. దీనివల్ల రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బర్ పనులు దశాబ్ద కాలం నిలిచిపోయాయని ఆయన ఆధారాలతో సహా వివరించారు.

2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ అడ్డగోలు జీఓలను రద్దు చేశారని సోమిరెడ్డి తెలిపారు. అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో ఢిల్లీ స్థాయిలో పోరాడి జువ్వలదిన్నె హార్బర్ కోసం రూ. 288 కోట్లు (కేంద్రం రూ. 138 కోట్లు, రాష్ట్రం రూ. 150 కోట్లు) మంజూరు చేయించామని చెప్పారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన 908 మీటర్ల జెట్టీతో ఈ మెగా హార్బర్‌ను తామే డిజైన్ చేయించామని ఆయన స్పష్టం చేశారు.

గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం కాంట్రాక్టుల ద్వారా డబ్బులు దండుకోవడం తప్ప, హార్బర్ పనులను పూర్తి చేయలేదని సోమిరెడ్డి విమర్శించారు. మత్స్యకారుల కోసం తాము కష్టపడి నిధులు తెస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జగన్ జువ్వలదిన్నె పర్యటనకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రైవేటుపరం చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని సోమిరెడ్డి కొట్టిపారేశారు. సాగర్ డిఫెన్స్ వంటి సంస్థలు రావడం వల్ల మత్స్యకార యువతకు అత్యాధునిక టెక్నాలజీపై అవగాహన పెరుగుతుందని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు.

మత్స్యకారుల చిరకాల స్వప్నమైన జువ్వలదిన్నె హార్బర్‌ను మరో మూడు నెలల్లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సోమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వదిలేసిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ రెడ్డి తన పర్యటనలో గతంలో జారీ చేసిన ఆ వ్యతిరేక జీఓలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…