LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు!

Prajavedhika: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణలో భూ కబ్జాలు, వేధింపులు మరియు పోలీసుల అక్రమ కేసులపై బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. నాయకులు పూల నాగరాజు, కుడిపూడి సత్తిబాబు అర్జీలను స్వీకరించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

AndhraPravasi News Desk 2 min read
Prajavedhika: టీడీపీ గ్రీవెన్స్‌కు వెల్లువెత్తిన అర్జీలు! బాధితుల కష్టాలు.. ఒకదానిని మించి మరొకటి విని చలించిన నేతలు!

ప్రభుత్వ ఇళ్ల కబ్జాపై లక్ష్మమ్మ పోరాటం.. టీడీపీ కార్యాలయంలో న్యాయం కోసం విన్నపం…

ప్రేమ పేరుతో కిరాతకం: బలవంతపు గర్భస్రావం చేసిన నిందితుడిపై చర్యలకు నాగలక్ష్మి డిమాండ్…

ఆర్టీసీ కండక్టర్‌పై అక్రమ కేసు.. పోలీసుల ఫోర్జరీ బట్టబయలు చేసిన భార్య…

Prajavedhika: నేడు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా వినతుల స్వీకరణ' కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బాధితుల నుండి నాయకులు అర్జీలను స్వీకరించారు. అనంతపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు పూల నాగరాజు, ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ ఆక్రమణలు, వేధింపులు, పోలీసుల అక్రమ కేసులపై బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన లక్ష్మమ్మ అనే వృద్ధురాలు, ప్రభుత్వం తనకు 1998లో కేటాయించిన ఇంటిని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. నిందితులు తప్పుడు రశీదులు సృష్టించి, తనపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నాగలక్ష్మి అనే మహిళ, పెళ్లి పేరుతో తనను మోసం చేసి, బలవంతంగా గర్భస్రావం చేయించిన కిశోర్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడి కుటుంబ సభ్యులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె నాయకులకు విన్నవించారు.

పల్నాడు జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి తులసి తన భర్త (ఆర్టీసీ కండక్టర్) పై పోలీసులు ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా కేసు పెట్టారని ఫిర్యాదు చేశారు. నకిలీ స్టాంపు పేపర్లను సృష్టించి తన భర్తను హింసించారని, ఈ విషయంలో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మరోవైపు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాంబమూర్తి, గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి నుండి తహశీల్దార్ తమను వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమి తప్ప తమకు మరో ఆధారం లేదని ఆయన పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాకు చెందిన రిటైర్డ్ సైనికుడు సంతోష్ కుమార్, ప్రభుత్వం తనకు కేటాయించిన పట్టా భూమిని సాగులోకి మార్చుకున్నా, అధికారులు పట్టా మంజూరు చేయడంలో కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు చెందిన పద్మావతి అనే వృద్ధురాలు, తన సొంత ఇంటి నుండి కోడలు తనను గెంటేసిందని, నకిలీ పత్రాలతో ఇంటిని ఆక్రమించుకుందని నాయకులకు మొరపెట్టుకున్నారు. పోలీసులకు, పెద్దమనుషులకు చెప్పినా న్యాయం జరగలేదని ఆమె వాపోయారు.

వీటితో పాటు పలువురు బాధితులు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణ సమస్యలపై నాయకులకు అర్జీలు అందజేశారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రెస్యూమ్‌లు ఇవ్వగా, అనారోగ్యంతో ఉన్నవారు ఆర్థిక సహాయం కోరారు. స్పందించిన నాయకులు పూల నాగరాజు మరియు కుడిపూడి సత్తిబాబు, ఈ సమస్యలన్నింటినీ సంబంధిత శాఖల మంత్రులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని వారు స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…