LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Prajavedhika: ప్రజా వేదిక లో బాధితుల ఆక్రందన! కన్సల్టెన్సీల కక్కుర్తి.. భూ బకాసురుల అరాచకాలు!

Prajavedhika: ప్రజా వేదిక లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన దేవినేని ఉమా మరియు రఘురామరాజు.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

AndhraPravasi News Desk 2 min read
Prajavedhika: ప్రజా వేదిక లో బాధితుల ఆక్రందన! కన్సల్టెన్సీల కక్కుర్తి.. భూ బకాసురుల అరాచకాలు!

మంగళగిరి, మార్చి 12, 2026 న టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా విన్నపాల కార్యక్రమం నేడు ఫిర్యాదుదారుల కన్నీళ్లతో, బాధితుల ఆక్రందనలతో అట్టుడికిపోయింది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఏపీ స్టేట్ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు* ప్రజా సమస్యలను స్వీకరించారు. అక్కడ బయటపడిన కొన్ని సంఘటనలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.

1. అబ్రాడ్ సొల్యూషన్స్ అరాచకం: రూ. 13.70 లక్షల మాయాజాలం!

విదేశాల్లో చదువుకోవాలన్న విద్యార్థి కలను 'అబ్రాడ్ సొల్యూషన్స్' యజమాని ఆలపర్తి చంద్రశేఖర్ అడ్డం పెట్టుకున్నాడు. కంచికచర్లకు చెందిన శ్రీనివాసరావు కోసం నరేంద్ర కుమార్ అనే వ్యక్తి తన ఖాతా నుండి ఏకంగా రూ. 13.70 లక్షలు కన్సల్టెన్సీకి బదిలీ చేశాడు. యూకేలోని డీ మోంట్‌ఫోర్ట్ యూనివర్సిటీకి ఫీజు చెల్లించామని దొంగ రశీదులు చూపించి, తీరా విచారించగా డబ్బు వెనక్కి మళ్లించినట్లు ఆధారాలు దొరికాయి. ఇప్పుడు డబ్బు అడిగితే దుబాయ్ ఏజెంట్ల సాకులు చెబుతూ, బాధితుడిపైనే దాడులకు తెగబడుతున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా న్యాయం జరగకపోవడంతో బాధితులు నేతలను ఆశ్రయించారు.

2. స్కూల్‌లో స్టూడెంట్ మృతి: ప్రమాదమా? గొంతు నులిమి హత్య చేశారా?

సింగరాయకొండలోని ఒక ప్రముఖ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల సయ్యద్ తౌషిక్ మరణం వెనుక పెను మిస్టరీ దాగి ఉంది. ఫిబ్రవరి 14న తల్లిదండ్రులతో క్షేమంగా మాట్లాడిన గంటకే ఆ బాలుడు విగతజీవిగా మారాడు. పాఠశాల యాజమాన్యానికి సంబంధించిన రహస్యాలను చూశాడన్న నెపంతో ప్రిన్సిపాల్ రమణారెడ్డి, అతని కుమారులు కలిసి బాలుడి గొంతు నులిమి చంపేశారని తండ్రి సయ్యద్ అలీ ఆరోపిస్తున్నారు.

 "సీసీటీవీ ఫుటేజీని మాయం చేశారు.. బాబు మెడపై రంధ్రాలు ఉన్నాయి.." అంటూ ఆ తండ్రి చేసిన ఫిర్యాదు అక్కడ ఉన్నవారందరినీ కలిచివేసింది.

3. ప్రభుత్వ కాలేజీలో 'ప్రిన్సిపల్' అరాచక సామ్రాజ్యం!

వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరపై వెల్లువెత్తిన ఫిర్యాదులు షాక్‌కు గురిచేస్తున్నాయి. తోటి అధ్యాపకులపై భౌతిక దాడులు, కుల వివక్ష, ఏకంగా *రూ. 90 లక్షల వసూళ్లు!* ఏసీబీ నోటీసులు ఇచ్చినా రాజకీయ బలంతో ఆమె ఆగడాలు కొనసాగుతున్నాయని, బాధితుడు జయవర్ధన్ సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశాడు.

4. భూ ఆక్రమణలు - నిరుపేదల హాహాకారాలు

  •  పిడుగురాళ్ళ: 266 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను 'భూ బకాసురులు' ఆక్రమించుకున్నారు. 299 కుటుంబాలు నేడు రోడ్లపై, షెడ్లలో తలదాచుకుంటున్న దయనీయ స్థితి.
  • అనంతపురం: 60 ఏళ్లుగా ఉన్న పొలం దారిని అక్రమంగా మూసివేసి, తహశీల్దార్‌ను సైతం ప్రభావితం చేస్తున్న వైనంపై రైతు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
  • పోరుమామిళ్ల: దేవుడి గుడి కట్టిస్తానని నమ్మించి, నిరక్షరాస్యురాలైన లక్షమ్మ భూమిని దొంగ పత్రాలతో కాజేసి అమ్మకానికి పెట్టిన కర్నాటి బలరామిరెడ్డి మోసం వెలుగులోకి వచ్చింది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…