Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.! Ramanarayana Reddy: "నెల్లూరు జిల్లా ఆలయాలకు మహర్దశ".. పునర్నిర్మాణ పనులపై మంత్రి ఆనం కీలక సమీక్ష.! Janardhan Reddy: అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. 20 నెలల్లో రూ. 1117 కోట్లతో 44 % పైగా పనులు పూర్తి! Chandrababu: ప్రపంచ స్థాయి పరికరాల ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. సచివాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం.. Minister Gottipati: గ్రామాల్లో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపై మంత్రి కీలక ఆదేశం.. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా.. Assam Elections 2026: అస్సాం బీజేపీ మేనిఫెస్టో విడుదల: మహిళలకు నెలకు రూ.3,000 సాయం! Minister Nimmala: కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మాస్టర్ ప్లాన్.. చంద్రబాబు ప్రత్యేక దృష్టి.. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే.! AP Development: అమరావతిపై జగన్ వైఖరి మార్చుకోవాలి.. డ్యామ్ సైట్ నుంచి సీఎంకు ఫోన్ చేసిన పయ్యావుల! Minister Narayana: 40 ఏళ్ల నాటి సమస్యకు నెల రోజుల్లోనే పరిష్కారం.. ఇంటింటికీ వెళ్లి.. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య! Chandrababu Tour: నెల్లూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన! రేపు పింఛన్ల పంపిణీలో - రాత్రికి ఒంటిమిట్టలోనే.! Nara Lokesh: మునగాలపాడులో విషాదం.. నేనున్నాను.. అర్జున్ సోదరి కోమలి భవిష్యత్తుకు లోకేష్ హామీ.!

PM Ujjwala Yojana: ఉజ్వల గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్: రూ.300 సబ్సిడీ కావాలంటే ఈ పని తప్పనిసరి!

PM Ujjwala Yojana: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు రూ.300 గ్యాస్ సబ్సిడీని పొందాలంటే ప్రతి ఆర్థిక సంవత్సరం ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి. మార్చి 31, 2026 లోపు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ఎలా పూర్తి చేయాలో..

Published : 2026-03-31 17:20:00

PM Ujjwala Yojana: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. పేద మహిళల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రారంభమైన ఈ పథకం కింద గ్యాస్ వాడుతున్న వారు, తమకు వచ్చే సబ్సిడీని కోల్పోకుండా ఉండాలంటే వెంటనే అప్రమత్తం కావాలి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్‌పై లభించే రూ.300 రాయితీని పొందడానికి ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

ఏటా ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి

ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి తమ బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్  పూర్తి చేయాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్  స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే, గ్యాస్ రీఫిల్ బుకింగ్‌లో గానీ లేదా సబ్సిడీ అందడంలో గానీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సబ్సిడీ ఎవరికి.. ఎంత వరకు?

ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకునే ఉజ్వల వినియోగదారులకు ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ ఇస్తోంది. అయితే, ఇది ఏడాదికి గరిష్టంగా 9 రీఫిల్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. 14.2 కిలోల సిలిండర్ వాడేవారు 8వ లేదా 9వ రీఫిల్ సమయానికి కచ్చితంగా బయోమెట్రిక్ పూర్తి చేయాలి. అదేవిధంగా 5 కిలోల చిన్న సిలిండర్లు వాడే వారైతే, 21వ రీఫిల్ నుంచి ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

డెడ్‌లైన్ ఎప్పటి వరకు అంటే..

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవైసీ ప్రక్రియను మార్చి 31, 2026 లోపు పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలు సూచిస్తున్నాయి. దేశంలో గ్యాస్ కొరత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అర్హులైన వారికే సబ్సిడీ చేరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన తర్వాత కేవైసీ పెండింగ్‌లో ఉంటే సబ్సిడీ ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, లబ్ధిదారులు వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను ముగించుకోవడం ఉత్తమం.

ఇంట్లోనే కేవైసీ పూర్తి చేసే అవకాశం

వినియోగదారుల సౌకర్యార్థం ఈ కేవైసీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. దీని కోసం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హెచ్‌పీ పే మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నుంచే బయోమెట్రిక్ పూర్తి చేయవచ్చు. ఒకవేళ యాప్ వాడటం తెలియకపోతే, ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి ద్వారా కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తి చేసే వెసులుబాటును కల్పించారు.

Spotlight

Read More →