Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

ఆ కేసులో సంచలనం.. పిన్నెల్లి బ్రదర్స్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ!

గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ6, ఏ7గా నిందితులు..వాస్తవాల రాబట్టేందుకు విచారణ జరపనున్న పోలీసులు..పల్నాడులో మళ్ళీ రాజకీయ వేడి..పల్నాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్

2026-01-19 22:35:00
దావోస్ వేదికగా ఏపీ 'ఫ్యూచర్ ప్లాన్'.. ఫుడ్ ప్రాసెసింగ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో లోకేశ్ మార్క్ డీల్స్!
  • గుండ్లపాడు జంట హత్యల కేసులో ఏ6, ఏ7గా నిందితులు..
  • వాస్తవాల రాబట్టేందుకు విచారణ జరపనున్న పోలీసులు..
  • పల్నాడులో మళ్ళీ రాజకీయ వేడి..
Thyroid: అయోడిన్ నుంచి విటమిన్ C వరకు.. థైరాయిడ్‌కు మేలు చేసే ఆహారాలు!

పల్నాడు రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన గుండ్లపాడు జంట హత్యల కేసులో సోమవారం నాడు కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ మాచర్ల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుల నుంచి కీలక సమాచారాన్ని, హత్యల వెనుక ఉన్న అసలు కుట్రను వెలికితీయాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం మన్నించింది. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉన్న వీరిద్దరిని పోలీసులు రేపు (మంగళవారం) తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. 

జ్యూరిచ్‌లో చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎన్నార్టీల కోసం రూ. 50 కోట్ల ఫండ్.. ప్రతి ఇంట్లో..

ఏమిటీ జంట హత్యల కేసు?
ఈ కేసు 2025 మే నెలలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన దారుణ హత్యలకు సంబంధించింది. జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు రాజకీయ కక్షల నేపథ్యంలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6 (A6) గా, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిని ఏ7 (A7) గా చేర్చారు.

మస్కట్ తీరాన ఎన్టీఆర్ స్మరణ.. 30వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించిన ఎన్నార్టీలు!

గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసం, ప్రత్యర్థులను అణగదొక్కే క్రమంలో పిన్నెల్లి సోదరులే ఈ హత్యలకు పరోక్షంగా సహకరించి, ప్రణాళిక రచించారని పోలీసులు గట్టిగా వాదిస్తున్నారు. పిన్నెల్లి సోదరులు ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ముందస్తు బెయిల్ కోసం వారు హైకోర్టును, ఆ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, నేరం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. ఎక్కడా ఊరట లభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. అప్పటి నుంచి వారు నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు! మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు!

మాచర్ల కోర్టు జడ్జి జనవరి 20, 21, 22 తేదీల్లో నిందితులను విచారించేందుకు పోలీసులకు అనుమతినిచ్చారు. హత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడారు? ఎక్కడ పథకం రచించారు? అన్న కోణంలో పోలీసులు ప్రశ్నించనున్నారు. హత్యకు వాడిన ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎక్కడ దాచారు అనే విషయాలను రాబట్టే అవకాశం ఉంది. ఈ హత్యల కోసం ఎవరికైనా సుపారీ ఇచ్చారా లేదా అన్న కోణంలో కూడా ఆరా తీయనున్నారు.

Lokesh: అభివృద్ధికి అడ్డుపడుతున్న ‘టీం 11’ రాజకీయాలు! మంత్రి లోకేశ్ ఫైర్..!

పిన్నెల్లి సోదరుల కస్టడీ విచారణతో గుండ్లపాడు హత్యల వెనుక ఉన్న మిస్టరీ వీడుతుందని పల్నాడు ప్రజలు భావిస్తున్నారు. ఈ మూడు రోజుల విచారణలో పోలీసులు ఏయే విషయాలను బయటపెడతారోనని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆటోఇమ్యూన్ వ్యాధులు.. ముందుగా కనిపించే లక్షణాలివే..!!
నూతన జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవ ఎన్నిక.. కమల దళంలో యువ రక్తానికి పట్టం!
తిరుమలలో రథసప్తమి సంబరాలు.. ఒకే రోజు ఏడు వాహనాలపై.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!
Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!!

Spotlight

Read More →