Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన!

ఆస్ట్రేలియా, అమెరికా, ఉగాండా, డెన్మార్క్ నుంచి వచ్చిన ఎన్నారైలు.. చంద్రబాబుతో భేటీ!

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూనే ప్రజలతో నేరుగా మమేకమయ్యే విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. అధికార

Published : 2026-01-08 12:44:00
Zoo Park: ఏపీలో కొత్తగా జూపార్క్! 250 హెక్టార్లలో... అక్కడే ఫిక్స్!

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూనే ప్రజలతో నేరుగా మమేకమయ్యే విధానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు. అధికార బాధ్యతల మధ్య కూడా ప్రజలకు సమయం కేటాయిస్తూ, వారి అవసరాలు, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం, జనవరి 6న అమరావతి సచివాలయంలో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన ఎన్నారైలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Liquor Bottle Case: తిరుమల మద్యం సీసాల కుట్రను ఛేదించిన పోలీసులు!

ఆస్ట్రేలియా, అమెరికా, ఉగాండా, డెన్మార్క్ దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, వారి కుటుంబ నేపథ్యం, వృత్తి జీవితాలు, వారు నివసిస్తున్న దేశాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తిగా ఆరా తీశారు. ప్రవాసుల అనుభవాలను శ్రద్ధగా వింటూ, రాష్ట్రంతో వారి అనుబంధాన్ని మరింత బలపరచే దిశగా చర్చించారు.

Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం! ఏపీలో ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా నుండి విజయ్ చెన్నుపాటి, సతీష్ గద్దే, మనోజ్ యండపల్లి, రంజిత్ కావూరి, భార్గవ దాసరి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకాగా, అమెరికా నుండి బొడ్డు మురళి, ఉగాండా నుండి గరికపాటి చిన్నా చౌదరి, నాగబాబు, డెన్మార్క్ నుండి పొట్లూరి అమర్నాథ్ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు.

Capital Of AP : అమరావతికి చట్టబద్ధత ఇవ్వాలి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు!!

సీఎం చంద్రబాబు తో ఎన్నారైలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, అతిథ్య రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం లో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Mega Project: కేంద్రం గ్రీన్ సిగ్నల్... రెండు రాష్ట్రాలను కలిపే మెగా ప్రాజెక్ట్! రూ.816 కోట్లతో...

వారి అభిప్రాయాలకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ఎన్నారైలు స్పష్టమైన, సమగ్రమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

Housing Scheme: ఏపీలో పేదలకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం! అప్పుడే ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో రాష్ట్రానికి ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములవ్వడాన్ని ప్రభుత్వం హర్షిస్తుందని, వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చూపిన ఆత్మీయత తమను ఎంతో ఆకట్టుకుందని, ఆయనతో నేరుగా మాట్లాడిన అనుభవం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు.

Peanut Butter: నిద్ర పట్టక సతమతమవుతున్నారా.... పీనట్ బటర్ తో రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు!
ORR: ఏపీలో కొత్తగా మరో ఔటర్ రింగ్ రోడ్డు.. రూ.1,930 కోట్లతో! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
kidney stones: కిడ్నీ స్టోన్స్‌కు బీరు మందా.. నిజం ఇదే!
Venkaiah Naidu: భారత్‌కు మేధస్సు కొదవ లేదు.. వెంకయ్యనాయుడు!

Spotlight

Read More →