LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు!

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సహాయం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏప్రిల్ మొదటి వారంలోనే పార్లమెంట్‌లో ఈ బిల్లు వచ్చే అవకాశం ఉండటంతో, అమరావతికి ఇకపై ఎలాంటి రాజకీయ అడ్డంకులు ఉండవని ప్రభుత్వం భావిస్…

AndhraPravasi News Desk 1 min read
Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు!

ఆంధ్రుల కలల రాజధానికి ఢిల్లీ బాట - కేంద్ర కేబినెట్ ఆమోదమే తరువాయి…

రాజధాని ఒక పవిత్ర యజ్ఞం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు….

అమరావతి బలోపేతం - కేంద్రం చేతికి ఏపీ భవిష్యత్తు బిల్లు…

Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు శాసనసభలో ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ, దానికి కేంద్రం పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించాలని ఈ తీర్మానం ద్వారా కోరారు. గతంలో ఎదురైన న్యాయపరమైన, రాజకీయపరమైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వ చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనపై స్పష్టతనిచ్చారు. అమరావతి రాజధాని బిల్లు ఈరోజే కేంద్రానికి చేరుతుందని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై చర్చ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న కేంద్ర క్యాబినెట్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేస్తుందని, ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇది ఐదున్నర కోట్ల ఆంధ్రుల కల సాకారమయ్యే దిశగా పడుతున్న అతిపెద్ద అడుగు అని ఆయన పేర్కొన్నారు.

అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా భావోద్వేగంగా ప్రసంగించారు. రాజధాని నిర్మాణం అనేది ఒక పవిత్ర యజ్ఞమని, ఇందులో భాగస్వాములయ్యే అవకాశం సభలోని సభ్యులందరికీ లభించిందని అన్నారు. 2014లో విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యతను ప్రజలు చంద్రబాబుకు అప్పగించారని, అప్పుడే రాజధాని సంకల్పం జరిగిందని గుర్తు చేశారు. అయితే మధ్యలో వచ్చిన అడ్డంకులు రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధాని వంటి కీలక నిర్ణయాలు మార్చడం రాష్ట్ర భవిష్యత్తుకు క్షేమకరం కాదని స్పీకర్ స్పష్టం చేశారు. ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల మేరకు అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి రథానికి ఇకపై ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకూడదని, అమరావతి నిర్మాణం నిరాటంకంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…