LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటాం.. అమరజీవి త్యాగశిల్పం చాలా బాగుందని కితాబు!

Nara Lokesh: రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 2 min read
Nara Lokesh: ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటాం.. అమరజీవి త్యాగశిల్పం చాలా బాగుందని కితాబు!
  • జెట్ స్పీడ్ తో విగ్రహ ఏర్పాటు పూర్తిచేసిన ట్రస్ట్ సభ్యులను అభినందించిన మంత్రి…
     
  • అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబం, ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు…

Amaravati Nara Lokesh: రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అనంతరం రాత్రి ఉండవల్లి నివాసంలో పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు. అమరజీవి త్యాగశిల్పం చాలా బాగుందని ఈ సందర్భంగా మంత్రి కితాబిచ్చారు. అమరావతి శాఖమూరు పార్క్ లో జెట్ స్పీడ్ తో 194 రోజుల్లోనే కాంస్య విగ్రహ ఏర్పాటు పూర్తిచేయడంతో పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం విజయవంతం పట్ల పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ట్రస్ట్ ఛైర్మన్ డూండి రాకేష్ ను శాలువా, ప్రత్యేక జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటాం
ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం విజయవంతంగా జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం చాలా కళగా ఉంది. రికార్డ్ సమయంలో విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన ప్రతిఒక్కరికి అభినందనలు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు. కార్యక్రమం విజయవంతం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. యువగళం పాదయాత్ర సమయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్వగ్రామానికి వెళ్లి స్ఫూర్తి పొందాను. పొట్టి శ్రీరాములు చరిత్ర, త్యాగనిరతిని భావితరాలకు తెలియజేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయన త్యాగం, పోరాటం వెలకట్టలేనివి. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఏపీని తీర్చిదిద్దుతాం. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. 12 నెలల్లోనే స్మృతివనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నిర్మాణం పూర్తిచేయాలి. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. ఆత్మీయ విందు సమావేశం ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో జరిగింది. మంత్రి లోకేష్ ప్రతిఒక్కరినీ పేరుపేరునా పలకరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అమరజీవి పొట్టి శ్రీరాములు మనవరాలు రేవతి తంగుడు, అనురాధ దేవకి, మునిమనవరాళ్లు, మునిమనవళ్లు వసుధ, అమర్, అజయ్, కుందా ప్రతిభ, కుందా ప్రతాప్ తో పాటు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…