LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్ కు ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం

Nara Lokesh: సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ విమానాశ్రయం వద్ద తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆత్మీయంగా స్వాగతం తెలిపారు.

AndhraPravasi News Desk 1 min read
Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్ కు ప్రవాసాంధ్రుల ఘన స్వాగతం

“జై బాబు.. జై లోకేష్” నినాదాలతో మార్మోగిన సింగపూర్ విమానాశ్రయం..

ఏపీకి రాయల్ ఎన్ ఫీల్డ్ రాకపై లోకేష్‌కు ప్రవాసాంధ్రుల ప్రశంసలు..

సింగపూర్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ విమానాశ్రయం వద్ద తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆత్మీయంగా స్వాగతం తెలిపారు. “జై బాబు.. జై లోకేష్” నినాదాలతో విమానాశ్రయం పరిసరాలు మార్మోగిపోయాయి. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రవాస భారతీయులు మంత్రి లోకేష్‌ను కలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాయల్ ఎన్ ఫీల్డ్ అంశం. ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రముఖ సంస్థను తీసుకురావడంలో మంత్రి లోకేష్ తీసుకున్న చొరవపై ప్రవాసాంధ్రులు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన చూపుతున్న చురుకుదనాన్ని అభినందించారు. “ఏపీ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం” అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. “మీరు కేవలం ఉద్యోగులు కాదు.. ప్రపంచానికి ఏపీ ప్రతినిధులు. మీరు పనిచేస్తున్న కంపెనీల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులు, అవకాశాల గురించి గర్వంగా చెప్పండి” అని పిలుపునిచ్చారు.

రాష్ట్రానికి మరిన్ని ఐటీ కంపెనీలు, పరిశ్రమలు వచ్చేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు యువత తమ అనుభవం, పరిజ్ఞానంతో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా విద్య, ఐటీ, సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.

మంత్రి లోకేష్ రాకతో సింగపూర్‌లోని తెలుగు వారిలో కొత్త ఉత్సాహం కనిపించింది. రాష్ట్రానికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుందని ప్రవాసాంధ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…