LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి!

Bhuvaneshwari Kuppam Tour: ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో భువనేశ్…

AndhraPravasi News Desk 2 min read
Bhuvaneshwari: ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్.. త్వరలో విజయవాడ , అనంతపురంలో.. మహిళలు ఆర్థికశక్తిగా ఎదగాలి!
  • Politics: ట్రస్ట్ నిర్వహణలో దాతలు, సిబ్బంది సహకారం మరువలేనిది..
     
  • కుప్పం నియోజకవర్గంలో ముగిసిన  నారా భువనేశ్వరి 4 రోజుల పర్యటన.. 

Bhuvaneshwari Kuppam Tour: ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల  పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలతో సమావేశమయ్యారు. 4వ రోజు పర్యటనలో ముందుగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుప్పంలో కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బాల్య స్నేహితుడు చంద్రశేఖర్ ఇంటికి  భువనేశ్వరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.  ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త బాల కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పేదలకు అండగా ట్రస్ట్ సేవలు
ఎన్టీఆర్ స్పూర్తితో, సీఎం చంద్రబాబు సహకారంతో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయింది.  చంద్రబాబు గారు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ట్రస్ట్ బాధ్యతలు నాకు అప్పగించారు. చంద్రబాబు గారు అందించిన స్పూర్తితో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం.  తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా వంతు సాయం అందిస్తున్నాం. దాతలు కూడా మాకు సాయంగా నిలుస్తున్నారు.  త్వరలోనే విజయవాడ , అనంతపురంలో కూడా తలసేమియా సెంటర్లు ప్రారంభిస్తాం.  ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో నాలుగు బ్లడ్ బ్యాంక్స్ నిర్వహిస్తున్నాం. త్వరలో విజయవాడలో ప్రారంభిస్తాం. తలసేమియా బాధితుల కోసం మే 10న హైదరాబాద్ లో నిర్వహించే రన్ లో అందరూ పాల్గొని వారికి ధైర్యం చెప్పాలని భువనేశ్వరి కోరారు.

ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి కల్పన
ఎన్టీఆర్ ట్రస్ట్  ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపుల నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా 23 లక్షలమందికి సేవలు అందించాం. ఇందుకోసం రూ.23 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. ఏజెన్సీ ఏరియాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్, డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ద్వారా  గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే పిల్లలకు గణితం, ఆంగ్లంలో పట్టు సాధించేలా శిక్షణ అందిస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే అందుకు దాతలు, మా సిబ్బంది సహకారమే కారణం. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన నాకు చంద్రబాబు గారు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించినప్పుడు ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. ఏదైనా చేయగలను అని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే విజయం సాధించగలం. మహిళల ఆర్థక స్వావలంబన కోసం కుప్పంలో స్త్రీ శక్తి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళల ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం హైదరాబాద్ లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ ఏర్పాటు చేశామని భువనేశ్వరి తెలిపారు. అనంతరం 40  మంది మహిళలకు కుట్టు మిషన్లు, 30 మందికి తోపుడు బండ్లు , పలువురికి వినికిడి మిషన్లను భువనేశ్వరి అందజేశారు. 

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…