LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..!

Amaravati: అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి తరపున ప్రతినిధులు, ఇతర కీలక నే…

AndhraPravasi News Desk 1 min read
Amaravati: కలిసికట్టుగా ముందుకు.. మహిళా బిల్లు వేడుకకు వైసీపీని కూడా పిలవాలని కూటమి నిర్ణయం..!
  • "అమరావతిలో మహిళా బిల్లు పండుగ": ఈ నెల 17న ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో భారీ కార్యక్రమం..
     
  • Politics: రెండున్నర గంటల పాటు సాగిన ఎన్డీఏ భేటీ: రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై లోతైన చర్చలు..

Chandrababu: అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి తరపున ప్రతినిధులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మరియు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలపాలని ఈ సమావేశంలో కూటమి నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ వేడుకలో రాజకీయాలకు తావులేకుండా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని నేతలు నిశ్చయించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే ఘట్టాన్ని అమరావతిలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని కూటమి నిర్ణయించింది. ఈ నెల 17న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు. అమరావతి వేదికగా బిల్లును వీక్షించేలా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ భారీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు నిర్వహించాలని నేతలు ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళా సాధికారతకు చిహ్నంగా నిలిచే ఈ బిల్లును పండగ వాతావరణంలో స్వాగతించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై వస్తున్న సందేహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు విషయంలో నెలకొన్న గందరగోళంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడి స్పష్టత తీసుకున్నారు. దక్షిణాదికి రాజకీయంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా, 50 శాతం సీట్లు పెరుగుతాయనే విషయంపై కేంద్రం నుంచి భరోసా లభించిందని కూటమి నేతలు స్పష్టం చేశారు. సీట్ల పెంపుపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, దేశ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ కలిసికట్టుగా స్వాగతించాలని నేతలు నిర్ణయించారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…