LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Mahanadu 2026: టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం! మహానాడు ఏర్పాట్లపై దృష్టి..

Mahanadu 2026: మంగలగరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమై, పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మరికొందరు కీలక నేతలు హాజరయ్యారు.

AndhraPravasi News Desk 1 min read
Mahanadu 2026: టీడీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం! మహానాడు ఏర్పాట్లపై దృష్టి..

మహానాడు నిర్వహణపై చర్చ, స్థలంపై తుది నిర్ణయం..

పార్టీ కమిటీలపై కీలక నిర్ణయాలు, రాజకీయ వ్యూహాలపై దృష్టి..

మంగలగరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కీలక సమావేశం జరిగింది. మంత్రి నారా లోకేష్ అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమై, పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మరికొందరు కీలక నేతలు హాజరయ్యారు.

మే నెలలో జరగనున్న మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది. మహానాడు కోసం రెండు ప్రదేశాలను టీడీపీ హైకమాండ్ పరిశీలిస్తోంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతాలను పరిశీలనలో ఉంచారు.

ఈ రెండు ప్రాంతాల్లో అనుకూలమైన స్థలాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర అద్యక్షులు పల్లా శ్రీనివాస రావు కు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17న మహానాడు నిర్వహణ స్థలంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మహానాడు ముందు టీడీపీ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులను ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పోలిట్ బ్యూరోలో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మండల స్థాయి నాయకులకు కూడా పోలిట్ బ్యూరోలో చోటు కల్పించే దిశగా పార్టీ ఆలోచన చేస్తున్నట్లు చర్చల్లో వెల్లడైంది. దీంతో పార్టీ నిర్మాణంలో కొత్త మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరింత బలమైన వ్యూహాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశం టీడీపీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసేలా సాగింది. పార్టీని బలోపేతం చేయడం, మహానాడు విజయవంతం చేయడం లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…