LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Modi: బెంగాల్‌లో మోదీ ర్యాలీకి జనవాహిని.. టీఎంసీపై తీవ్ర విమర్శలు!

Modi: ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. బిష్ణుపూర్‌లో జరిగిన భారీ ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని విపక్షాలపై, ముఖ్యంగా టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Modi: బెంగాల్‌లో మోదీ ర్యాలీకి జనవాహిని.. టీఎంసీపై తీవ్ర విమర్శలు!

బిష్ణుపూర్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం..

మహిళా బిల్లును అడ్డుకున్న విపక్షాలకు బుద్దిచెప్పాలి..

బెంగాల్: ఎన్నికల వేళ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. బిష్ణుపూర్‌లో జరిగిన భారీ ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని విపక్షాలపై, ముఖ్యంగా టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చి మోదీకి నీరాజనం పట్టారు. సభ ప్రారంభం కాకముందే ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోవడం విశేషంగా కనిపించింది.

ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బెంగాల్‌లో ఎక్కడికి వెళ్లినా ప్రజల ఆదరణ అద్భుతంగా ఉందని చెప్పారు. సభలు జనాలతో నిండిపోవడం ప్రజల్లో మార్పు కోరిక పెరుగుతోందని సంకేతమని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలకు ఈ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేసిన మోదీ, “టీఎంసీ ఒక సిండికేట్‌లా మారి బెంగాల్ ప్రజలను దోచుకుంటోంది. అవినీతి పరాకాష్టకు చేరింది. ఈ అవినీతిపరులు లొంగిపోవాల్సిందే” అని అన్నారు. ఏప్రిల్ 23న టీఎంసీ పరాజయం తప్పదని ధీమా వ్యక్తం చేశారు.

బెంగాల్ నాయకత్వం ప్రజలకు పెద్ద ద్రోహం చేసిందని, అభివృద్ధి కన్నా స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. “బీజేపీ మాత్రమే మహిళా హక్కులను కాపాడగలదు. మహిళల సాధికారతకు మేమే కట్టుబడి ఉన్నాం” అని స్పష్టం చేశారు.

కేంద్ర పథకాలను బెంగాల్‌లో పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ, “ఇది మోదీ గ్యారంటీ” అన్నారు. అవినీతిని అంతం చేయాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఈసారి మార్పు ఖాయమని పేర్కొన్నారు. “మమత సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయి.

బెంగాల్ ప్రజలు ఈసారి నిర్ణయం తీసుకోబోతున్నారు” అని మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సభతో బెంగాల్ ఎన్నికల పోరు మరింత ఉత్కంఠగా మారింది. రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రతిఆరోపణలు కొనసాగుతుండగా, ప్రజల తీర్పుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…