BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు! Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. మార్చి 9న ఓటర్ల తుది జాబితా! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు వెయిటేజ్! 22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! BC Reservations: చంద్రబాబు ఉగాది కానుక.. స్థానిక సంస్థల్లో మళ్లీ పెరిగిన బీసీ రిజర్వేషన్లు! Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. మార్చి 9న ఓటర్ల తుది జాబితా! Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన! పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు వెయిటేజ్! 22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.!

CII Meet: సీఐఐ సమ్మిట్‌లో భారీ పెట్టుబడుల సంకేతాలు..! ఏపీకి ఇండస్ట్రీల భారీ గ్రీన్‌సిగ్నల్..!

 ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి కొత్త దిశగా నిలిచిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శుక్రవారం అ

Published : 2025-11-14 11:11:00
డ్వాక్రా మహిళలకు ఎగిరి గంతేసే వార్త! ఇంటి నుండే భారీ ఆదాయం... ఎలాగంటే!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి కొత్త దిశగా నిలిచిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి జ్యోతిప్రజ్వలన చేసి సదస్సుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఐఐ నాయకత్వం తదితరులు పాల్గొన్నారు. దేశ–విదేశాల నుంచి  పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ముఖ్యంగా కరణ్ అదానీ, యూసఫ్ అలీ, బాబా కల్యాణి వంటి ప్రముఖులు హాజరై సదస్సు వైభవాన్ని మరింత పెంచారు.

Hyderabad: బాహుబలి విమానం.. హైదరాబాద్‌లో ల్యాండ్..! ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే..!

సదస్సు ప్రారంభోత్సవం నుంచే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై తమ గట్టి విశ్వాసాన్ని ప్రకటించడం విశేషం. అదానీ పోర్ట్స్ & సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"లో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోందని ప్రశంసించారు. డేటా సెంటర్లు, పోర్టులు, సిమెంట్ రంగాల్లో ఇప్పటికే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించామని తెలిపారు. యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టడం పరిశ్రమలకు బలాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

IRCTC Child Ticket: పిల్లలతో రైలు ప్రయాణం చేస్తున్నారా.. ఇవి తప్పక పాటించాల్సిందే! ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు!

జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ, చంద్రబాబు విజన్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఏపీని గ్లోబల్ ఎయివేషన్ మ్యాప్‌లో నిలబెడుతుందని చెప్పారు. విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్ (MRO) కేంద్రం ఏర్పాటు పట్ల ఆసక్తి చూపుతూ, ఇది రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పెట్టుబడులు వచ్చేలా చేస్తుందని వివరించారు. ఇదే సమయంలో బజాజ్ ఫిన్‌సర్వ్ చైర్మన్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కేవలం రాష్ట్రం కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు ‘గ్రోత్ ఇంజిన్’ అని అభివర్ణించారు. 1,000 కిలోమీటర్ల తీరప్రాంతం వాణిజ్యం, టెక్నాలజీ అభివృద్ధికి ప్రేరణనిస్తోందని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలలో యువత కోసం స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

FIFA World Cup 2026: 2026 ఫిఫా వరల్డ్‌కప్‌కు చేరుకోవాలనే లక్ష్యంతో పోర్చుగల్ జట్టు..ఆర్మేనియాపై గెలుపే కీలకం!!

భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి వంటి ప్రముఖులు కూడా ఏపీని ఆవిష్కరణలు, స్కిల్లింగ్, ఆధునిక పారిశ్రామిక వాతావరణానికి కేంద్రంగా అభివర్ణించారు. జీనోమ్ వ్యాలీ రూపకల్పన నుంచి కోవిడ్ వ్యాక్సిన్ తయారీ వరకు చంద్రబాబు విజన్ ఎంత కీలక పాత్ర పోషించిందో సుచిత్రా ఎల్లా గుర్తుచేశారు. ఏఐ, డేటా ఆధారిత యుగంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని అమిత్ కల్యాణి అన్నారు. మొత్తం మీద, సదస్సు మొదటి రోజే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు ఏపీపై తమ నమ్మకాన్ని బలంగా వెల్లడించడంతో, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ తదుపరి పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా ఎదుగుతోందని వారి వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.

Srisailam: శ్రీశైలం భక్తులకి గుడ్ న్యూస్..! రూ.200 కోట్ల ప్రాజెక్టుతో యాత్రికులకు లగ్జరీ వసతి సౌకర్యాలు!
Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!!
National Highways: వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్..! యూపీఐ చెల్లింపులకు భారీ సడలింపు..!
US Education:అమెరికా యూనివర్సిటీలకు విదేశీ దరఖాస్తులు భారీగా తగ్గింపు… భారత విద్యార్థుల అప్లికేషన్లు 14% కుప్పకూలిన సంచలన రికార్డు!!
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన!
Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంలో దూసుకెళ్లిన వందేభారత్ స్లీపర్‌ రైలు… వీడియో వైరల్

Spotlight

Read More →