LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Iran USA War: ట్రంప్ ద్వంద్వ నీతి - ఇరాన్ మొండి పట్టుదల భారత్ మధ్యవర్తిత్వమే ఏకైక మార్గమా?

Iran USA War: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న అస్థిరమైన వ్యూహాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అప్పుల ఊబిలో ఉన్న పాకిస్తాన్ మధ్యవర్తిత్వం సాధ్యమేనా? ఇరాన్ రాయబారి భారత్‌ను ఎందుకు 'ట్రస్టెడ్ పార్ట్నర్' అని ప…

AndhraPravasi News Desk 2 min read
Iran USA War: ట్రంప్ ద్వంద్వ నీతి - ఇరాన్ మొండి పట్టుదల భారత్ మధ్యవర్తిత్వమే ఏకైక మార్గమా?

India Iran Relations: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతి, మరోవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ మధ్యవర్తిత్వ నాటకాలు ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే భారత్ వంటి 'నమ్మదగిన భాగస్వామి'  అవసరమని ఆయన స్పష్టం చేయడం, అంతర్జాతీయ వేదికపై మన దేశ పరపతికి నిదర్శనంగా నిలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఇప్పుడు అందరినీ అయోమయానికి గురి చేస్తోంది. ఒక పక్క ఐదు రోజుల పాటు 'యుద్ధ విరామం'  అంటూనే, మరోపక్క యు.ఎస్.ఎస్. బాక్సర్ వంటి యుద్ధ నౌకలను, వేల సంఖ్యలో మెరైన్ సైనికులను, పారా ట్రూపర్లను ఇరాన్ సరిహద్దులకు పంపడం ఆయనపై నమ్మకాన్ని పూర్తిగా సడలించింది. మాట ఒకటి చెప్పి, చేతల్లో యుద్ధానికి కాలుదువ్వడం ట్రంప్ నైజమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో వెనిజులా విషయంలో కూడా గడువు ఇచ్చి, కొన్ని గంటల్లోనే అక్కడి అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన చరిత్ర ఆయనకుంది. ఇలాంటి అస్థిరమైన నాయకత్వం ఉన్నప్పుడు ఏ దేశమైనా అమెరికాను ఎలా నమ్ముతుంది?

మరోవైపు, అప్పుల ఊబిలో ఉన్న పాకిస్తాన్ ఈ సంక్షోభంలో మధ్యవర్తిగా మారుతాననడం హాస్యాస్పదంగా మారింది. లీటర్ పెట్రోల్ 220 రూపాయలు దాటి, సామాన్యుడు బండి తీయడానికే భయపడుతున్న తరుణంలో, ఆ దేశం యుద్ధాన్ని ఆపుతుందా లేక తన సైన్యాన్ని అమెరికాకు అద్దెకు ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకం. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఇరాన్‌పై కన్నెర్ర చేస్తున్న నేపథ్యంలో, పాకిస్తాన్ తన రక్షణ ఒప్పందాల ప్రకారం ఎవరి వైపు నిలబడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇరాన్ కమాండర్లు ఇప్పటికే పాకిస్తాన్‌ను హెచ్చరించారు—తమపై దాడులకు పాక్ గడ్డను వాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన వాదన వినిపిస్తోంది.

ఇరాన్ ఇప్పుడు 'మొజాయిక్ డిఫెన్స్' వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అంటే ఎక్కడికక్కడ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది ముప్పు అనిపిస్తే పై అధికారుల ఆర్డర్ కోసం ఎదురుచూడకుండానే దాడి చేసే అధికారం వారికి  ఉంటుంది. ఇలాంటి మొండి పట్టుదలతో ఉన్న ఇరాన్, అమెరికాతో నేరుగా మాట్లాడటానికి ఇష్టపడదు. వాళ్ళు కోరుకుంటున్నది ఒక్కటే దిల్లీలో జయశంకర్ గారు కూర్చుని ఈ పంచాయతీని పరిష్కరించాలని భారత్ పట్ల వారికి ఉన్న అపారమైన నమ్మకమే దీనికి కారణం. గ్లోబల్ సౌత్ కి ప్రతినిధిగా, అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉన్న దేశంగా భారత్ మాత్రమే ఇక్కడ సరైన మధ్యవర్తి.

 ట్రంప్ తన 15 పాయింట్ల ఎజెండాతో పాకిస్తాన్ ద్వారా ఏదో చేయాలని చూస్తున్నా, అది క్షేత్రస్థాయిలో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రష్యా పూర్తి మద్దతు ఉన్న ఇరాన్‌ను కేవలం బెదిరింపులతో లొంగదీసుకోవడం సాధ్యం కాదు. ప్రపంచానికి గ్యాస్, ఇంధన సరఫరా సజావుగా సాగాలన్నా, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకూడదన్నా భారత్ రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది. జయశంకర్ గారి దౌత్య నీతి ఈ మంటలను ఆర్పగలదని అంతా ఆశిస్తున్నారు. ట్రంప్ తన దూకుడు తగ్గించుకోనంత కాలం శాంతి అనేది ఎండమావిగానే మిగిలే ప్రమాదం ఉంది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…