LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravati Quantum Valley: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ బెడ్‌లు.. ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు శ్రీకారం..!

Amaravati Quantum Valley: దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లను ఏప్రిల్ 14న అమరావతిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు ఏపీని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చనున్నాయి

AndhraPravasi News Desk 2 min read
Amaravati Quantum Valley: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్ బెడ్‌లు.. ఏప్రిల్ 14న సీఎం చంద్రబాబు శ్రీకారం..!

Amaravati Quantum Valley: భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానానికి చిరునామాగా అమరావతి మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు 'క్వాంటం టెక్నాలజీ'పై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్‌లను అమరావతిలో ఏర్పాటు చేశారు. ఈ నెల 14వ తేదీన ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా వీటిని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం.

రాష్ట్ర రాజధానిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దీని కోసం విజయవాడలోని మేధా టవర్స్, అమరావతిలోని ఎస్ఆర్ఎం  యూనివర్సిటీల్లో రెండు ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిని 'భారత్ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్' అని పిలుస్తారు. ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 'అమరావతి 1ఎస్', 'అమరావతి 1క్యూ' అనే రెండు చిన్న క్వాంటం కంప్యూటర్లను అమర్చారు. క్యూబిట్ ఫోర్స్ అనే స్టార్టప్ సంస్థ ఈ కంప్యూటర్ల తయారీలో కీలక పాత్ర పోషించింది.

ఈ ప్రాజెక్టు వెనుక దేశంలోని అగ్రశ్రేణి పరిశోధనా సంస్థల కృషి ఉంది. ముంబయిలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు క్వాంటం అందించాయి. అలాగే డీఆర్డీవో శాస్త్రవేత్తలు కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో సహకరించారు. ప్రైవేటు సంస్థలైన ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్, క్యూట్ ఎలక్ట్రానిక్స్ తమవంతుగా హార్డ్‌వేర్ భాగాలను సమకూర్చాయి. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేతులు కలపడం వల్ల అమరావతిలో క్వాంటం విడిభాగాల తయారీకి గట్టి పునాది పడింది.

ఈ టెస్ట్ బెడ్‌ల వల్ల పరిశోధకులకు, విద్యార్థులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా క్వాంటం చిప్‌లను పరీక్షించాలంటే మన దేశంలో సరైన వసతులు లేక విదేశాలకు పంపాల్సి వచ్చేది. దీనివల్ల సమయం, డబ్బు వృథా అయ్యేవి. ఇప్పుడు అమరావతిలోనే ఈ పరీక్షలు చేసుకునే వీలుంటుంది. కేవలం థియరీ చదువులకే పరిమితం కాకుండా, విద్యార్థులు నేరుగా ఈ కంప్యూటర్లపై ప్రయోగాలు చేసే అవకాశం కలగడం ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో అమరావతిని క్వాంటం హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు 111 క్యూబిట్స్ వరకు ఉన్న ప్రాసెసర్లను ఇక్కడ పరీక్షించవచ్చు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని పది లక్షల (మిలియన్) క్యూబిట్స్ వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, ఉన్నత విద్యావంతులైన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…