Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు!
Quantum Technology: అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం టెస్టింగ్ మరియు రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించారు. ఇది నేషనల్ క్వాంటం మిషన్ కింద పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. ఈ కేంద్రం ద్వారా క్వాంటం హార్డ్వేర్ తయారీ, సర్టిఫికేషన్ మరియు స్టార్టప్లకు గొప్ప ప్రోత్స…
Politics- డీప్ టెక్ రంగంలోనూ చంద్రబాబు ముందడుగు…
క్వాంటం కంప్యూటింగ్ తయారీకి అమరావతి వేదిక…
డీప్ టెక్ స్టార్టప్లకు అమరావతి కేరాఫ్…
Quantum Technology: ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ మరియు రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాందికర్ మాట్లాడుతూ, డీప్ టెక్ (Deep Tech) రంగంలో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో ఈ టెస్ట్ బెడ్లను నిర్మించడం ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేశామని ఆయన వివరించారు.
క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో కమ్యూనికేషన్, ఫైనాన్స్, మరియు డిజైన్ వంటి కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కరాందికర్ తెలిపారు. ఐటీ రంగంలో ఏపీని ముందంజలో నిలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు డీప్ టెక్ రంగంలోనూ అదే స్ఫూర్తితో ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. ఈ కేంద్రం క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ తయారీ మరియు సర్టిఫికేషన్ ప్రక్రియలో జాతీయ స్థాయి బెంచ్మార్క్గా నిలవనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నేషనల్ క్వాంటం మిషన్లో భాగంగా ప్రైవేటు రంగ పరిశోధనలకు కూడా ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేవలం ఉపకరణాల తయారీకే పరిమితం కాకుండా, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా నూతన ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ రంగంలో మానవ వనరుల నైపుణ్యాన్ని పెంచే దిశగా జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇందులో ఏపీ కూడా కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.
Be the first to react