LIVE
Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  •  Yogandhra: ఉపమాకలో పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం.. యోగాసనాలు వేసిన హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్!  •  AP Government: రైతులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. 85% సబ్సిడీతో ఆ పథకం పునరుద్ధరణ!  •  TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ఘన విజయం!  •  Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్న భక్తులు!  •  Praja Vedika: నేడు (17/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  AP Farmers: రైతులకు డబుల్ ధమాకా.... ఒకే రోజు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల!  • 
⚡ BREAKING
Politics

Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.!

Chandrababu: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ చేసే కార్యక్రమాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ వేగవంతం చేసింది. తడి చెత్త, పొడి చెత్త ప్రాసెస్ చేసే షెడ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేందుకు ఆయా ఏజన్సీల ప్రతినిధులతో స్వచ్ఛ ఆంధ్ర…

AndhraPravasi News Desk 1 min read
Chandrababu: చెత్త నుంచి సంపద సృష్టి.. 107 పట్టణాల్లో అత్యాధునిక రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు పట్టాభిరామ్ గ్రీన్ సిగ్నల్.!
  • ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ కేంద్రాలపై స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ప్రత్యేక శ్రద్ధ..
     
  • సత్వరం పనులు చేపట్టాలని  ఏజన్సీలకు చైర్మన్ పట్టాభిరామ్ ఆదేశాలు..

Chandrababu: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాలలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు  ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ చేసే కార్యక్రమాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ వేగవంతం చేసింది. తడి చెత్త, పొడి చెత్త ప్రాసెస్ చేసే షెడ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టేందుకు ఆయా ఏజన్సీల ప్రతినిధులతో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్  మంగళవారం  అమరావతిలోని కార్పోరేషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు.  గృహ, వాణిజ్య వ్యర్థాల నుంచి ప్లాస్టిక్,  కాగితం, లోహాలు, గాజు వంటి వస్తువులను వేరు చేసి, శుద్ధి చేసి, ప్యాక్ చేసి, రీసైక్లింగ్ పరిశ్రమలకు విక్రయించే ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ కేంద్రాల ఏర్పాటుకు కావలసిన భూమి సమకూర్చడం, స్టోరేజీ ట్యాంకులు,  షెడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు.  ఫ్రెష్ వేస్ట్ ప్రాసెస్ కేంద్రాలలో తయారయ్యే కంపోస్ట్ ని వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అందజేస్తారు. వేరుచేసిన ప్లాస్టిక్, ఇతర పొడి వ్యర్థాలను రీసైక్లింగ్ యూనిట్స్‌కు పంపుతారు. 

మొత్తం 107 నగరాలు, పట్టణాలలో 58 చోట్ల ఈ కేంద్రాల ఏర్పాటుకు కావలసిన భూమి అందుబాటులో ఉన్నట్లు చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. మిగిలిన ప్రాంతాలలో కూడా మున్సిపల్ కమిషనర్లు, ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి త్వరితగతిన భూమి కేటాయించేలా చూస్తామని చెప్పారు.  మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి ఈ కేంద్రాలకు విద్యుత్, నీరు, రోడ్ల సౌకర్యం కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు.  ఏజన్సీల ప్రతినిధులు భూముల స్వాధీనం విషయమై ఆయా కమిషనర్లు, రీజినల్ డైరెక్టర్లను కలిసి, సమన్వయంతో పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.  భూములు కేటాయించిన ప్రాంతాలలో వెంటనే  సాయిల్ టెస్ట్ చేయమని చెప్పారు. వేగంగా పనులు మొదలు పెట్టాలని చెప్పారు. ఈ యూనిట్లలో వినియోగించే మిషనరీలను మంచి పేరున్న కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. 
తొలుత కార్పోరేషన్ అధికారులు ఎంఆర్ఎఫ్ కేంద్రాలు, షెడ్ల నిర్మాణం ఎలా ఉండాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో మొత్తం 10 ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

Be the first to react

More Coverage

Madanapalle: మదనపల్లిలో అటహాసంగా సాగిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలన విజయోత్సవ సభ.. ముఖ్య అతిథిగా.. రాటకొండ మధుబాబు కీలక వ్యాఖ్యలు!

Madanapalle: మదనపల్లిలో అటహాసంగా సాగిన రెండేళ్ల కూటమి ప్రభుత్వం పాలన విజయోత్సవ సభ.. ముఖ్య అతిథిగా.. రాటకొండ మధుబాబు కీలక వ్యాఖ్యలు!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి కూటమి ప…