LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి?

TDP vs YCP: అమరావతి అభివృద్ధిపై వైసీపీ ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి విసిరిన సవాల్‌ను స్వీకరించిన తెలుగుయువత నేత బండారు వంశీకృష్ణ. సీఆర్డీఏ కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి చూసినా వైసీపీ ప్రతినిధి రాకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అసలు ఏం జరిగిందంటే?

AndhraPravasi News Desk 2 min read
TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి?

చెప్పిన మాట ప్రకారం వంశీకృష్ణ రాక

వర్షం సాకుతో కాలయాపన?

రాత్రి వేళ వీడియోతో ప్రత్యక్షం

TDP vs YCP: : గత శుక్రవారం ఉదయం 'ప్రైమ్ 9' న్యూస్ ఛానల్ నిర్వహించిన 'హాట్ టాపిక్' చర్చా కార్యక్రమంలో అమరావతి రాజధాని అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ డిబేట్‌లో వైసీపీ ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ.. అమరావతిలో అసలు పనులే జరగడం లేదని, బయట వ్యక్తులను లోపలికి రానివ్వడం లేదని ఆరోపించారు. ఒకవేళ అభివృద్ధి జరుగుతుంటే చూపించాలని, తాను ప్రత్యక్షంగా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ వెంటనే స్వీకరించారు. అక్కడికక్కడే సమయం కూడా ఖరారైంది.

మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి వస్తానని నాగమల్లేశ్వరి చెప్పడంతో, బండారు వంశీకృష్ణ సరిగ్గా అదే సమయానికి అమరావతిలోని సీఆర్డీఏ (CRDA) కార్యాలయానికి చేరుకున్నారు. తన ఫోన్ నంబర్‌ను కూడా డిబేట్ లోనే బహిరంగంగా ప్రకటించిన వంశీకృష్ణ, ఆమె రాక కోసం ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం 4 గంటలకు డిబేట్ నిర్వాహకుడు రాజు కూడా అక్కడికి చేరుకున్నారు.

వంశీకృష్ణ అక్కడ వేచి ఉండగా.. నాగమల్లేశ్వరి ఫోన్ చేసి వర్షం కారణంగా ఆలస్యమవుతోందని, మరో అరగంటలో వస్తానని చెప్పారు. అయితే గంటలు గడుస్తున్నా ఆమె రాలేదు. 6:30 గంటల సమయంలో వంశీకృష్ణ, మోడరేటర్ రాజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. చివరకు రాత్రి 7 గంటల వరకు వేచి చూసిన వంశీకృష్ణ, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాజధానిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికి ఆయన అక్కడి నుండి వెనుతిరిగారు.

అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో, రాత్రి 8 గంటల తర్వాత నాగమల్లేశ్వరి ఒక వీడియోను విడుదల చేశారు. తాను అమరావతికి వచ్చానని అందులో పేర్కొన్నారు. అయితే, సవాల్ విసిరిన సమయానికి రాకుండా, ఎదుటి పక్షం నేతలు వెళ్ళిపోయిన తర్వాత రహస్యంగా వచ్చి వీడియోలు పెట్టడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "చర్చకు పిలిచి ముఖం చాటేయడం ఎందుకు?" అని కొందరు ప్రశ్నిస్తుంటే, వైసీపీ కావాలనే విషప్రచారం చేస్తోందని మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి అమరావతి కేంద్రంగా జరిగిన ఈ 'ఛాలెంజ్' రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…