Buddha Venkanna: విజయసాయిరెడ్డికి బుద్దా వెంకన్న కౌంటర్! అమరావతి అభివృద్ధిపై ఘాటు విమర్శలు..
Buddha Venkanna: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అమరావతి అభివృద్దిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
హైదరాబాద్, బెంగళూరు ఒక్కరోజులో అభివృద్ధి కాలేదు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
అభివృద్ధి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంకన్న ఆరోపించారు. “హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఒక్కరోజులో అభివృద్ధి కాలేదు. అలాగే అమరావతి అభివృద్ధికి కూడా సమయం పడుతుంది” అని స్పష్టం చేశారు.
అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ఐటీ, పారిశ్రామిక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వెంకన్న సూచించారు. పెట్టుబడులు ఆకర్షించి ఉద్యోగావకాశాలు పెంచితేనే యువతకు మంచి భవిష్యత్ ఏర్పడుతుందని తెలిపారు. అభివృద్ధి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Be the first to react