Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు! Industrial Boom: ఏపీలో 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం..! రూ.810 కోట్ల పెట్టుబడులతో 12 వేల ఉద్యోగాలు..! Mata Association Meet: మాటా అసోసియేషన్‌ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రసాద్‌..! ప్రపంచవ్యాప్తంగా తెలుగు వైభవం చాటుదాం..! America: భారత్ ప్రేమను తిరిగి తెచ్చుకుంటాం… వాణిజ్య ఒప్పందం చివరి దశలో ట్రంప్ వ్యాఖ్యలు!! Delhi Red Fort: 3 గంటలు పార్క్ చేసిన కారు… ఒక్కసారి పేలుడు! ఎర్రకోట వద్ద ఏం జరిగింది? అమరావతిలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అకాడమీ! క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు! Jobs: ఇక ఐటీ ఉద్యోగాలు ఊర్లోనే..! వర్క్‌స్పేస్ పాలసీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్..! రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి! Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!! Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు!

రాయలసీమ ప్రజలకు నెరవేరబోతున్న చిరకాల స్వప్నం! ఆ జిల్లా రూపు రేఖలు మారబోతున్నాయి!

2025-11-11 07:52:00
Chandrababu: వాహనదారులకు ఊరట! వాటికి నో చెప్పిన చంద్రబాబు... కీలక ఆదేశాలు!

రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్‌ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డీఆర్వో వెంకట నారాయణమ్మతో కలిసి ఆయన స్థల గుర్తింపు, ఎంపికపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో ఇది చారిత్రాత్మక అడుగు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

Washington: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… BBCపై బిలియన్ డాలర్ల లీగల్ నోటీస్!!

సమావేశంలో మంత్రి టీజీ భరత్, ఏ, బీ, సీ క్యాంపుల్లో హైకోర్టు బెంచ్‌కు అనువైన భూములను గుర్తించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా కర్నూలు నగర అభివృద్ధి కొత్త దిశలోకి అడుగుపెట్టనుందని చెప్పారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో రాయలసీమ ప్రజలకు న్యాయ పరిపాలనలో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉన్నారని, ఆయన మార్గదర్శకత్వంలో కర్నూలు అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం! తప్పిన పెను ప్రమాదం!

ఇక నగర అభివృద్ధి పనులపై కూడా మంత్రి టీజీ భరత్ విస్తృత సమీక్ష నిర్వహించారు. రూ.12.62 కోట్లతో జరుగుతున్న 62 అభివృద్ధి పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కర్నూలును ఆధునిక నగరంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే నెలల్లో మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని చెప్పారు.

NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!!

మంత్రి మాట్లాడుతూ, హైకోర్టు బెంచ్‌ను నగర శివార్లలో కాకుండా బీ, సీ క్యాంపుల్లో ఏర్పాటు చేసే అవకాశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో విదేశీ పర్యటనలో చర్చించామని వెల్లడించారు. కర్నూలులో 160 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, దాని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ భూమిని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, హైకోర్టు నిర్మాణం వంటి పథకాల కోసం వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

గన్నవరం నియోజకవర్గంలో పీఆర్కే ఫౌండేషన్ జోరు.. ఉంగుటూరులో బడ్డీకొట్టు పంపిణీ! సమాజ సేవలో రాజకీయాలకు అతీతం!

అదనంగా, బుధవారపేట మెడికల్ కాలేజీ మలుపు వద్ద షాపుల అంశంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్యం, టిడ్కో గృహాలు, గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఇటీవల కర్నూలు పర్యటన సందర్భంగా హైకోర్టు బెంచ్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని టీజీ భరత్ తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి ఈ నిర్ణయం న్యాయసేవల ప్రాప్యతతో పాటు అభివృద్ధికి దోహదం చేయనుందని అన్నారు.

భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ.. పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించిన కేంద్ర హోంశాఖ!
Bhagavad Gita: కర్తవ్యం తెలుసుకొని చేయడమే నిజమైన యోగం.. గీతామాత ఉపదేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -57!
Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..!
ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి..
Praja Vedika: నేడు (11/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →